అ‘ద్వితీయుని' ఆత్మకథ
మహాభారతం భారతీయులకు పంచమవేదం. పురాణపురుషలను కాకుండా మనుష్యులను, మనుష్యుల స్వభావాలను, బలాలను, బలహీతలను, సుఖదుఃఖాలను, అనుభూతులను, ప్రతిస్పందనలను ప్రతిబింబించే మొదటి మహా కావ్యం మహాభారతం. వైశంపాయనులవారు మనకు అందించిన గొప్ప సాహిత్య సంపద, సగటు మనిషి జీవనయానానికి చుక్కాని మహాభారతం. ఎందరో మహానుభావులు భారతాన్ని వారిదైన శైలిలో రచించినారు. అయితే ఎవరూ పూనుకోని విధంగా భారత కథకు పరిపూర్ణతను చేకూర్చే కృషిలో భాగంగా వర్తమాన మలయాళ సాహిత్యానికి భీష్మపితామహుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, 'పద్మభూషణులు' శ్రీ ఎం.టి. వాసుదేవన్ నాయర్గారి అవిరళ కృషి, అగాధమైన అధ్యయనం, అలసటలేని పరిశోధనలకు ఫలితమే ఈ 'రెండామూజం' నవల. రామాయణంలో హనుమంతునితో పోల్చదగిన పాత్ర భారతంలో భీమసేనుడు. మహా పరాక్రమవంతుడు. ఆత్మాభిమానానికి, మానవ సహజస్వభావానికి నిలువెత్తు రూపం భీముడు. అన్యాయం ఎక్కడ, ఎవరికి ఎదురైనా తానుగా వెళ్ళి దానిని పరిహరించే స్వభావం భీమునిది. భారత యుద్ధాన్ని ఒంటిచేత గెలిపించినవాడు భీముడు. ఎంతటి కార్యసాధకుడో అంతగా ఒదిగి ఉండే మనస్తత్వం అతనిది. అందుకే 'ఎంటీ' గారు భీముని కథానాయకునిగా స్వీకరించి అతని ద్వారానే నిజాయితీతో కూడిన మహాభారత కథను చెప్పించినారు. ఈ భారత కథలో ఒక విలక్షణత ఉన్నది. మహాభారతంలో వ్యాసులవారు కొన్ని సందర్భాలలో మౌనాన్ని పాటించినారు. ఆ మౌనానికి సరైన అక్షర రూపాన్ని కల్పించి ఆ సందర్భాలను వాసుదేవన్ నాయర్గారు అర్థవంతంగా మార్చినారు. అందుచేతనే ఇది ఒక విశిష్టమైన, విలక్షణమైన, వైవిధ్యమైన భారతం. భీమమహాభారతం. మహాభీమ భారతం. ఎన్నో మహా అద్భుతాలను సృష్టించిన 'పద్మభూషణుడైన ఒక 'జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత' కలం నుంచి జాలువారిన అత్యద్భుత కృతి ఈ నవల. మొదటి పుటనుంచి చివరి పట వరకు ఆగకుండా చదివించగల అమోఘమైన శైలి ఎం.టి.వాసుదేవన్ నాయర్ గారిది. ...................................................