నేను తిరుపతి శిల్ప కళాశాలలో నాలుగేళ్లపాటు సాంప్రదాయ వాస్తు శిల్ప అసాలను విశ్వకర్మ వంశీయులైన అధ్యాపకుల దగ్గర నేర్చుకున్నాను. 1978లో వాదాయ శాఖ, 1981 నుంచి పురావస్తుశాఖలోను శిధిలమైన పురాతన ఆలయాలను ఊడదీసి మళ్లీ నిర్మించినప్పుడు చదువుకొన్న చదువు ఉపయోగపడి జీవనాధారమైన అందుకు సంతోషించాను. విశ్వకర్మ వంశీయులు, పంచవిధ శిల్పాలు, ఆలయ నిర్మాణ రంగంలో తలమునకలై ఉండి, శిల్పులు, స్థపతుల చరిత్రపై పరిశోధన చేయడానికి పూనుకోలేక పోయారు. 'నేను పురావస్తుశాఖలో స్థపపతిగా పనిచేయటాన,
శాసనాలను పరిశోధించి, తెలుగు శిల్పుల ఔన్నత్యాన్ని విశ్వకర్మ వంశీయులకేకాక, ఈ విషయంపై ఆసక్తిగల వారికి కూడా ఉపకరించేట్లు ఈ చిన్న పుస్తకాన్ని రాసి పంచవిధ శిల్పులకు అంకితమిచ్చి నా రుణం తీర్చుకొన్నాను.
-ఈమని శివనాగిరెడ్డి
విజయవాడ
10.11.2019