స్వాతి జల్లులు
కొందరి కథలు అనగా అనగా... తో మొదలై చివరికి సుఖాంతంగానో దుఃఖాంతంగానో ముగుస్తాయి. పాఠకులకు ఆలోచించి అర్థం చేసుకునే శ్రమ వుండదు. గబగబా చదివేసి నాలుగు మాటలు త్వరత్వరగా రాసెయ్యచ్చు. వయసులోనూ రచనలోనూ సీనియర్ అయినంత మాత్రాన అందరి కథలూ చాలా సులభంగా అర్థం కావాలని లేదు. ఎందుకంటే కాలక్రమంలో రచయితల చూపు విస్తృతం అవుతుంది. తాత్విక దృక్పథంలో, శైలీ శిల్పంలో పరిణతమైన మార్పు వస్తుంది. అటువంటి కొత్తతరం రచయితల రచనలు నిదానంగా చదివి అర్థం చేసుకోవాలి. ఈ సంపుటిలో "చిత్రిక" కథని చదివాక స్వాతికుమారిని అలానే చదవాలని తెలిసింది. ఆ ఒక్కటే కాదు ఏ ఒక్కటీ తేలికగా తీసుకునే కథ కాదు.
చిత్రిక కథనే తీసుకుందాం. రాజమ్మ నుంచి రజతాక్షి వరకూ కథానాయకి జీవన ప్రయాణంలో మానసికంగా దగ్గరై భౌతికంగా దూరం అయిన వ్యక్తులను, వారితో ఆమె రిలేషన్షిప్సన్న, అర్థం చేసుకోవాలంటే రచయిత వేన్లెంగ్త్్క పాఠకులు దగ్గరగా వుండాలి. అలాగే రాజమ్మ ముంచేతి మీద చెరగని మచ్చ, సీసాలో కొట్టుకొచ్చిన జెల్లీ ఫిష్, జింజర్ క్యాట్ వంటి మెటఫర్లు కూడా అర్థం కావాలి. మూస నీతి సూత్రాలకు, మూస జీవన సత్యాలకు అతీతంగా ఆబ్జెక్టివ్గా ఆలోచించడం, మారుతున్న ప్రపంచాన్ని కళ్ళు విప్పార్చుకుని చూడడం, మనిషి.......................