స్వప్న రాత్రుల్లో తిరుగాడుతున్న కవి
"మేఘం మాయమైంది
మేఘాల్ని కోసుకెళ్లి
ఏ నెర్రులిచ్చిన పొలంలో చల్లేడో రైతు!
చందమామ చిరునామా లేదే
చందమామని గోరుముద్దల్ని చేసి
మారం చేస్తున్న ఏ పిల్లోడికి పెట్టిందో అమ్మ!
మరి మినుగురు నక్షత్రాలెమయ్యాయో
చీకటి పడక ముందే నక్షత్రాలన్నిటిని
నోటికి కరుచుకుపోయిన పిట్టలు
యే చీకటి దీపాల్ని వెలుగిస్తున్నాయో!
భ్రమల్లోకి జారిపోతున్న భూమి
సూర్యుడి చుట్టూ పరిభ్రమించనంది
నో మోర్ రివల్యూషన్ అంటూ!
ప్రపంచాన్ని వదిలి పారిపోతున్న సూర్యుడ్ని
యే ఆదివాసీయుడు అజ్ఞాతంలోకి లాక్కెల్లేడో!"...................
(సూర్యుడు కనిపించాడా!)