గోవిలాపము
సీ॥ స్మరియింపరో “అహింసా పరమో ధర్మ”
మనెడు నార్యోక్తి పుణ్యాత్ములార!
భావింపరో “ఆత్మవత్సర్వ భూతాని"
యన్న ధర్మోక్తి ధన్యాత్ములార!
తరచరో “పాపాయ పరపీడన" మటన్న
సత్యార్ధమును దయాశాలులార!
అనరో “పరోపకారార్థం శరీర”మన్
దివ్యసూక్తిని బుధధ్యేయులార!
తే||జీవుల నకారణముగ హింసింతు రేల?
తోడిజీవుల మీవలె జూడరేల?
జంతుసంతతిబట్టి బాధింతు రేల?
దేహములఁ బెంప మమ్ము వధింతు రేల?
1
తాత్పర్యం :- “ఓ పుణ్యాత్ములారా! అహింసయే పరమధర్మమనే పెద్దలమాట మీరు స్మరించారా? (దయతో స్మరించండి) ఓ ధన్యాత్ములారా! 'అన్నిప్రాణులూ తమవంటివే' అనే ధర్మవాక్కును భావించలేరా? (భావించండి) ఓ దయాశాలులారా! 'పరపీడనం పాపానికి కారణమవుతుంద'నే సత్యార్థాన్ని మీరు తలంచరా? (భావించండి) జ్ఞానాన్నే లక్ష్యంగా దైవాన్నే లక్ష్యంగా) కల్గిన మహాత్ములారా! “ఇతరులకు ఉపయోగపడేందుకే ఈ శరీరాన్ని భగవంతుడిచ్చాడనే దివ్యసూక్తిని అనరెందుకు? (దయతో అనండయ్యా!) జీవుల్ని నిష్కారణంగా ఎందుకు చంపుతాయా? తోడిజీవుల్ని మీవలే ఎందుకు చూడరు? జంతువులను ఎందుకు..........