శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి
గ్రంథకర్త పరిచయము
"కాలజ్ఞాన సహిత శ్రీవీరబ్రహ్మేంద్రస్వాములవారి సంపూర్ణచరిత్ర"
అను ఈ పవిత్ర గ్రంథమును "శ్రీ జవంగుల నాగభూషణదాసు గారు వ్యయప్రయాసలకోర్చి రచన చేసి 1932 వ సం॥ గ్రంథరూపమున వెలువరించినారు. నాటినుండి నేటి వరకు శ్రీస్వామి వారి చరిత్ర ప్రతి సంవత్సరము నిరాటంకముగా పునర్ముద్రిత మౌతునే వుంది. దీనికి కారణం ఈ గ్రంథరచన యందు శ్రీ నాగభూషణ దాసు గారి ప్రత్యేక శైలి, పౌరాణిక విషయాలు రచన చేయడంలో వారికున్న సునిశిత దృష్టి, విశేషించి చారిత్రక వాస్తవాల సమగ్ర పరిశీలనతో పాఠక జన రంజకంగా ఈ గ్రంథము మలచబడి, ప్రచురింపబడుటయే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. శ్రీనాగభూషణదాసు గారు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి చరిత్ర రచనకుద్యమించు టకు గల కొన్ని ముఖ్యాంశాలతో బాటు శ్రీదాసుగారి జీవిత విశేషాలను కూడా పాఠక మహాశయులకు తెలియజేయుట సముచితమని అది ఈగ్రంథ ప్రకాశకులుగా మాబాద్యత అని భావించి, వాటిని ఈ క్రింద పొందు పరచుచున్నాము.
శ్రీజవంగుల నాగభూషణదాసు గారు తన చిన్ననాటినుండి భూత, భవిష్యత్, వర్తమానకాల విశేషాలను మరియు దేవరహస్యాలను తెలుసుకొనవలెనను కుతూహలము గలవారు మరియు ఒకపని సాధింప తలపెట్టిన, అది సాధించు వరకు విశ్రమించని స్థిరసంకల్పులు. గుంటూరు జిల్లా, సత్తెనపల్లి గ్రామము (ఆంధ్రప్రదేశ్) వీరి జన్మస్థలము. శ్రీదాసుగారు యుక్తవయసున సత్తెనపల్లిలో నిరంతర దైవతత్వాన్వేషకురాలైన శ్రీగురు జింకా పిచ్చమాంబగారి వద్ద గురు కారణమంది, ఆ తరువాత జ్ఞానబోధకులైన శ్రీమిరియాల వెంకటరంగార్యులకు ప్రియశిష్యులై, వారి ద్వారా శ్రీవీరబ్రహ్మంగారి గురించి విపులంగా తెలుసుకొని శ్రీవారి మఠానికి (కందిమల్లయపల్లె) వెళ్ళిరావాలని నిశ్చయించుకొన్నారు. పిమ్మట తన గురుదేవులైన శ్రీ రంగార్యులతో కలసి, శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠాన్ని సందర్శించి, శ్రీవారి మహిమలు విన్న శ్రీనాగభూషణదాసు గారు ఆశ్చర్యానందాను భూతి పొందారు. ఆ అనుభూతితోనే ఆయన మనస్సులో మెదిలింది ఒక కృత నిశ్చయం, అది శ్రీవీరబ్రహ్మేంద్రస్వాములవారి మహిమలు "రచన చేసి ప్రచురించా లని అయితే శ్రీవారి మహిమలు పరిపూర్ణంగా తెలుసుకొని గ్రంధస్థం చేయడం...................