నమో తస్స భగవతో అరహతో సమ్మాసమ్బుద్ధస్స ఖుద్దకనికాయ - జాతక కథలు (మొదటి భాగం) గ్రంథారంభ కథ (శ్రీలంకలో అనురాధపురంలోని మహావిహారంలో ఉన్నప్పుడు పూర్వ జాతక అట్టకథలను అనుసరించి ఈ జాతక అట్టకథలను వ్రాసిన ఆచార్య బుద్ధఘోషుడు గ్రంథారంభంలో త్రిరత్నాలకు నమస్కరించి ఇలా తెలియజేశాడు.) | లోకనాథుడైన ఆ మహర్షి (బుద్ధుడు), వేలకోట్ల జన్మలుగా ఈ లోకానికి అంతులేని హితాన్ని చేకూర్చాడు. ఆయన పాదాలకు నమస్కరించి ధమ్మానికి అంజలి ఘటించి అందరి గౌరవానికి పాత్రమైన సంఘానికి వందనం చేస్తున్నాను. ఎవరి శక్తి ప్రసరణం వలన అన్ని ఉపద్రవాలు తొలిగిపోతాయో, ఆ త్రిరత్నాలకు మరోసారి వందనం. అంతులేని పుణ్యం వల్లనే ఇవి నాకు లభించాయి.. ఆయా కారణాలను బట్టి ఆ ప్రకాశ స్వరూపుడు, ఆ మహర్షి అపణక మొదలైన జాతకాలను బోధించాడు. లోకాన్ని తరింపజేసే ఆ శాస్త్ర, ఆ మహాజ్ఞాని అనంత బోధి జ్ఞానం నుండి చిరకాలం | వాటిని ఉపదేశించాడు. వాటన్నిటిని ఒకచోట కూర్చి, ధమ్మసంగ్రాహకులు సంగీతిలో వాటికి జాతకం అని పేరు పెట్టారు................ |