Logili Books

Telugu

Kshetrayya Padamulu

By Manchala Jagannadha Rao

₹280
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kshetrayya Padamulu
Publisher
Potti Sriramulu Telugu Viswavidyalayam
ISBN
MANIMN6824
Binding
Paparback
Published Date
2018
Number Of Pages
469
Language
Telugu
Availability
In Stock
About this book

ప్రశస్తి

ప్రాచీన కాలమునుండి అసంఖ్యాకములైన గేయ రూపములు ప్రచారంలో వున్నాయి. పురందరదాసులవారు వరవడి పెట్టిన దాసకూట రచనలలో పల్లవి, అనుపల్లవి, చరణం అనే మూడు నిర్దుష్టమయిన భాగాలు వుంటాయి. తరువాత వచ్చిన కీర్తనలకు, పదములకు స్వరూప స్వభావములలో యీ దాసకూట రచనలే మార్గదర్శకాలు అవడంలో సందేహం లేదు. పద రచనకు ప్రప్రథమముగా క్షేత్రజ్ఞులే పూనుకొన్నారని చెప్పవచ్చు.

క్షేత్రజ్ఞులు జీవించిన కాలము, ఆనాటి సామాజిక పరిస్థితులు మనకు తెలిసినప్పటికీ, వారిజన్మస్థలము, తల్లిదండ్రులు, విద్యాభ్యాసము మొదలగు విషయాలను గురించి మనకు ఇదమిత్థ మని తెలియదనే చెప్పాలి. ఒక మహాభక్తునిగా 17 వ శతాబ్దంలో దక్కను ప్రాంతంలోని అనేక పుణ్యక్షేత్రాలను దర్శించారు క్షేత్రజ్ఞులు. ఆంధ్రదేశంలో మువ్వ అనే గ్రామంలో పుట్టి తంజా వూరు, మధుర మొదలైన దక్షిణ ప్రాంతాలకు తరలి వెళ్ళివుంటారని చారిత్రక విషయాలనుబట్టి నిర్ణయించబడింది. వారిని సన్మానించడానికి మహారాజులు ఒకరితో ఒకరు పోటీపడ్డారు. వారు నాలుగు వేలకుపైగా పదాలు వ్రాశారు, అయితే వాటిలో పదవవంతు మాత్రమే మనకు దక్కాయి.

అలౌకిక శృంగార రసాన్ని కాల్పనిక భావవ్యక్తీకరణగా మాత్రమేకాక, వివిధభాన సౌందర్యములను, గుణస్వభావములను చక్కగా ప్రదర్శిస్తూ మానవరూపంలో వున్న వ్యక్తులమధ్య కలిగిన అనుభూతులుగా సునిశితములైన పదరచన కావించారు క్షేత్రజ్ఞులు. రసజ్ఞాన విద్యా పరిధిలో శృంగారరసము ప్రధాన కథావస్తువు. క్షేత్రజ్ఞుని పదములలో నాయకనాయకీ భావము లను, వివిధ భావ అవస్థలను, రసములను చక్కగా వ్యక్త పరచు రచనలే అత్యధికముగానున్నవి. అనన్యసామాన్యములై న రసములను, సన్ని వేశములను, భావములను ఔచిత్య విమర్శతో ప్రద ర్పించుటలో క్షేత్రజ్ఞులు సిద్ధహస్తులు. అవస్థాన భేదములను చక్కగా వర్ణించి, తమ రచనలలో........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?