మహాదేవుని కాశీ క్షేత్రం
పురాతన నామం కాశికాపురి. కాశీ అనే పేరుకు అర్ధం కాంతినిచ్చే స్థలం. కాశీని వారణాసి మరియు బెనారస్ అని కూడ పిలుస్తారు. పురాణాల ప్రకారం కాశీ క్షేత్రం ఆకాశంలో త్రిశూలం పైన ఉండేది. యోగులు మరియు మహర్షులు మాత్రమే దానిని చూడగలిగేవారు. మహా ప్రళయం తర్వాత సూర్యుడు, వాయువు, నీరు, భూమి మరియు అగ్ని వంటి 'పంచభూతాలు' లేనప్పుడు మానవాళిని ఆశీర్వదించడానికి భూమిపై పవిత్ర కాశీ సాకారం చేయబడింది అని తెలుస్తుంది. పద్మ కల్పంలో స్వయంభువ మనువు పాలనలో, భూమిపై అరవై సంవత్సరాలుగా భయంకర కరువు నెలకొంది. భూమి పైన ఎటువంటి యజ్ఞాలు నిర్వహించక పోవడంతో దేవతలు హవిర్భాగాన్ని కోల్పోయారు. బలహీనంగా మరియు కృశించిపోయారు. బ్రహ్మ దేవుడు భూమిపై సృష్టి పనిని ఎలా కొనసాగించాలో అని ఆందోళన చెందాడు. ఆ సమయం నందు మనువు వంశస్థుడు అయిన రిపుంజయుడునే ఒక రాజర్షి, కాశీ నందు తపస్సు చేయసాగెను. భూమి పైకి బ్రహ్మ దిగి వచ్చి రాజర్షిని సమీపించి, "ఓ రాజర్షి! మీ తపస్సు చాలించి, దివోదాసు అను నామంతో ఈ భూమిని పరిపాలించు" అని విన్నపం చేస్తాడు.....................