డాక్టర్ శ్రీనివాస్ బైరి వ్రాసిన ఈ పుస్తకం ఆధునిక జీవనంలో ఒక అమూల్యమైన ఔషదం వంటిది. రచయిత, తన విద్య, వృత్తి, అనుభవాలను అతిజాగ్రత్తగా సమకూర్చి సమన్వయ పరచిన ఒక పుస్తకం. ఆరోగ్యమనేది కేవలం శరీరపరమైనది కాదు. శరీరం, మనసుకు ఒక అవినాభావమైన సంబంధముంది. శరీరానికి అనారోగ్యం కలిగినప్పుడు మనసుపై, మనసు భావోద్వేగాలకు లోనైనప్పుడు శరీరం పై ఆ ప్రభావం అనివార్యం. సుమారు ఏడు దశాబ్దాల క్రితం “హాన్స్ సెలీ” దీనిని ప్రయోగాత్మకంగా నిరూపిం చారు. కానీ కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మన భారతీయ ఆయుర్వేద శాస్త్రం ఈ పునాదుల పైనే నిలపబడింది. శ్రీమద్భగవద్గీత, అర్జున విషాద
యోగంలో యుద్ధ భూమికేతించిన అర్జునుడు ఇరుపక్షాలలో యుద్ధ సంసిద్ధులై నిలిచిన బంధు వర్గాన్ని చూసి తీవ్ర విషాదానికి గురై అస్త్రసన్యాసానికి సిద్ధపడినప్పుడు ఆ తీవ్ర విషాద ప్రభావానికి తన శరీరం కంపించి, ముచ్చెమటలు పట్టి, అంతటి వీరుని శరీరం నిస్సత్తువ అయిన సందర్భంలో, శ్రీకృష్ణ పరమాత్మ గీతా బోధ ద్వారా ఆయన మనసును వుత్తేజపరచడం