పిల్లలే మన భవిష్యత్తు
పిల్లలే ప్రపంచం. అవును. ఈ తరం తల్లితండ్రులు పిల్లలే ప్రపంచంగా ఉన్నారు. సమాచార విప్లవం మీద ఆధారపడిన ప్రస్తుత ప్రపంచంలో, పిల్లల పెంపకం, చదువు ఎన్నో మార్పులకు లోనవుతున్నాయి.
మానవ మెదడు భౌతిక ఎదుగుదల (Physical growth of the brain) గర్భస్థ శిశువు దశలోనే మొదలై, దాదాపు 25 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కొనసాగుతుంది. జీవిత
చరమాంకం వరకూ మెదడు అభివృద్ధి (న్యూరోప్లాస్టిసిటీ - అనుభవాలకు అనుగుణంగా మెదడు తన నాడీ కనెక్షన్ లను పునర్ వ్యవస్థీకరించుకునే సామర్ధ్యం) అవుతూనే ఉంటుంది. అయితే మొదటి తొమ్మిది సంవత్సరాలలో దాదాపు 90 శాతం పెరుగుదల పూర్తవుతుంది. అందుకనే తల్లి తండ్రులతో పాటు ప్రాథమిక విద్య కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
చదువు అనగానే మనకు బడి గుర్తుకొస్తుంది. ప్రభుత్వాలు, జిడిపి లో 6% చదువు మీద ఖర్చు పెట్టాలని ఎన్ని కమిటీలు చెప్పినా, ఆచరణలో అమలుకు నోచుకోలేదు. ప్రైవేటు బడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ఇప్పటి రోజుల్లో, తల్లి తండ్రులు కూడా పిల్లల చదువు మీద విస్తారంగా ఖర్చు పెడుతున్నారు.
బడి అనగానే మొత్తం బాధ్యత ఉపాధ్యాయుడి మీద వెయ్యడం సర్వసాధారణమై పోయింది. పిల్లల స్వేచ్ఛకు, స్వాతంత్రానికి, ఆత్మగౌరవానికి, పెరుగుదలకు అడ్డంకి బడే అనేదాక వెళ్ళింది వ్యవహారం. బడి, చదువు అంటే సౌకర్యాలు, ఉపాధ్యాయులు, పుస్తకాలు మాత్రమే కాదు, చదువు నేర్పే పద్ధతి, పుస్తకాల్లోని సమాచారం, ఉపాధ్యా యులు విద్యార్థుల మధ్య అనుబంధం, మూల్యాంకన పద్ధతి, తల్లిదండ్రుల మరియు స్థానిక సంస్థల సహకారం ఇవన్నీ కలిపి చూడాలని, అందుకవసరమైన పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ప్రారంభం కావాలని నమ్మిన వ్యక్తి ఈ పుస్తక రచయిత విఠపు బాలసుబ్రహ్మణ్యం. విద్య మీద వివిధ కమిటీల రిపోర్టులను అధ్యయనం చేయడమే కాక, గిజూ భాయి లాంటి మహామహుల ప్రయోగాలను వంటపట్టించుకున్న వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం.
ఆయన వివరణ చూస్తే వాస్తవం కళ్ళకు కట్టినట్టవుతుంది - పిల్లలు బడిలో ఉంటారు. కుటుంబానికి తోడుగా పనిలోనూ ఉంటారు. దీన్ని విశ్లేషిస్తే, ఏ ప్రభుత్వ...........................