శ్రీశైలలింగం శిరసా నమామి
సుమారు దశాబ్దం దాటి శ్రీశైలప్రభమాసపత్రికలో సహాయసంపాదకునిగా ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ శ్రీశైలమహాక్షేత్రానికి సంబంధించిన నేను పరిశీలించిన అనేక ప్రాచీన తాళపత్రాలు, వ్రాతప్రతులు, నూరేళ్లకు పైబడిన ప్రాచీన గ్రంథాలు, అనేక మంది పండితుల, స్థానికుల కథనాలు, ప్రత్యక్షంగా పరిశీలించిన స్థలాలు మొదలైనవాటిని క్రోడీకరించి అక్షరరూపంలో వెలువరించి వ్యాసాలుగా మార్చి శ్రీశైలప్రభ, భక్తి మొదలైన పత్రికల్లో ప్రచురితమైనవి, అప్రకటితంగా ఉన్నవాటిని శ్రీశైలీయం అనే ఈ పుస్తకం రూపంలో పాఠకులకు అందజేస్తున్నాను.
శ్రీలింగచక్రవర్తి శ్రీమన్మల్లికార్జునస్వామి, శ్రీనగాధిష్టాత్రి
శ్రీ భ్రమరాంబికాదేవి అనుగ్రహం లేనిదే ఇది సాధ్యం కాదు.
శ్రీశైలేశుని సన్నిధిలో అక్షరార్చన చేసుకోవడానికి మహదవకాశం కల్పించిన మా కుటుంబ శ్రేయోభిలాషులు, సహృదయులు, నాటి శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి, నేటి ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మదాయశాఖ సంయుక్త కమిషనర్ శ్రీ శీలం సూర్యచంద్రశేఖర ఆజాద్ గారికి, వారి సతీమణి శ్రీమతి శివకుమారి గారికి నా నమస్సులర్పించుకుంటున్నాను.
ఇది పుస్తకరూపంలో సాకారమవ్వడానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించిన వదాన్యులు - సహృదయులు ధార్మికులు డాక్టర్ శ్రీని గారు ధన్యవాదములు.............................