పుణ్య భూమి కర్మ భూమి అయిన మన భారతదేశంలో ప్రాచీన కాలం నుండి మనం ఎన్నో ఆచారాలను, సంప్రదాయాలను అనుసరిస్తూ వస్తున్నాం. వీటి వెనుక ఎన్నో అర్ధాలు, పరమార్ధాలు ఉన్నాయి.
యుగాది పర్వదినం మొదలు మహాశివరాత్రి వరకు మనం అనుసరించే పండగల పండగల వెనుక ఉన్న వైజ్ఞానికతను తెలుసుకుంటే మనపూర్వీకులు ఎంతటి శాస్త్రీయ దృక్పథం కలవారో అర్ధం అవుతుంది.
ప్రతి తిథినాడు ఆచరించవలసిన విధివిధానాలను నిర్దేశించారు. వీటిని కేవలం ఆధ్యాత్మిక దృష్టిలో మాత్రమే చూడటం వలన మారుతున్న దేశ కాలమాన పరిస్థితుల దృష్ట్యా వీటిని ఆచరించటానికి చాలా మంది ఆసక్తి కనపరచటం మానేసారు. నిజానికి వీటన్నిటిని కేవలం ఆధ్యాత్మికత దృష్టితో చూడకూడదు.