2019 జనవరిలో చండీఖోల్ - ఒరిస్సా వెళ్లినపుడు నాకు వాసులు చక్రవర్తితో పరిచయం ఏర్పడింది. ఆంగ్లభాషాచార్యుడిగా ఆయన కళాని విశ్వవిద్యాలయంలో పనిచేసారు. థామస్ హార్డీ నవలలపై ఆయన పిహెచ్.డి. చేసినారు. దాదాపు వందకు పైగా పుస్తకాలు, వ్యాసాలు వ్రాసినారు. నిత్యజీ లోని సంఘటనలను వేదాంతంతో, హిందూత్వ భావనలతో పోల్చి కవిత్వంగా మార్చి కవిత్వ ప్రియులకు అందిస్తున్నారు.
వాక్కు, నిశ్శబ్దాల మధ్య ఊగిసలాడే ప్రేమను వాసుదేవ చక్రవర్తి కవిత్వంగా మలచినాడు. ప్రకృతికి మానవుడికి మధ్య ఉన్న ఘర్షణలను, సరిహద్దులను తనదైన దృష్టితో గమనించినాడు. తాను చూసిన దృశ్యాలలో సమాధానాలను, ప్రశ్నలను గమనించి, గ్రహించి వాటిని వేదాంత భావనలకు అన్వయించి కవిత్వ చరణాలుగా రూపుదిద్దినాడు.
ఆలోచనలు రేకెత్తించే కవిత్వంతో అందరి మన్ననలను అందుకున్న వాసుదేవ చక్రవర్తి కవిత్వాన్ని తెలుగులోకి అనువదించి సాహితీలోకానికి అందజేస్తున్నాము. మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని విశ్వసిస్తూ.....
- డాక్టర్ లంకా శివరామప్రసాద్