సంధ్య యల్లాప్రగడ తెలంగాణలో పుట్టి పెరిగారు. వివాహానంతరము అమెరికా వెళ్ళారు. గత పదహరు సంవత్సరాలుగా అట్లాంటా నగరములో నివాసముంటున్నారు. ఫీనిక్స్ విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.ఎ డిగ్రి పొందారు. సాంఘిక సేవాసక్తితో వివిధ తెలుగు సంఘాలలో కార్యకర్తగా, అట్లాంటా తెలుగు సంఘములో పని చేశారు.
తానా, అమెరికన్ రెడ్ క్రాస్, అట్లాంటా సాయిటెంపుల్, అట్లాంటా హిందూ టెంపుల్, వీ.టీ.సేవ ఇత్యాది సంస్థల్లో స్వచ్ఛంద సేవలందించారు. దక్షిణ ఆసియా స్త్రీల సంక్షేమం కోసము సేవలందించే 'రక్ష' సంస్థ వారి “Ramesh Bakshi Leadership” అవార్డును, 'పాడుతా తీయగా' వారి సహకార అవార్డును, సిలికానాంధ్రవారి అవార్డును అందుకున్నారు. వీరు వ్రాసిన “నేను వడ్డించిన రుచులు, చెప్పిన కథలు” అన్న పుస్తకం 2020లో ప్రచరించబడింది. కొన్ని కథలు, కవితలు కూడా ప్రచురించబడినాయి. కౌముది, సంచిక, మాలిక, దర్శనం, నెచ్చెలి వెబ్ మ్యాగజైన్స్ లో వీరిని ప్రతినెలా ప్రచురితమౌతున్నవి. ఊహలు ఊసులు అన్న తెలుగు బ్లాగుకు ఈవిడ రచయిత.