తొలి సంవత్సరాలు
మేము తూర్పు పాకిస్తాన్లోని సిలైట్ పొలిమేరల్లో ఉండగా రేడియో టెలిఫోన్ సందేశం వచ్చింది. ఆ సాయంత్రం డక్కా (నేటి ఢాకా)లో జరగనున్న (పాక్ సైన్యం) లొంగుబాటు కార్యక్రమంలో నేను పాల్గొనాలని ఆ సందేశం. ఆనాటి తేదీ, ఆ సమయం నా మనసులో గాఢంగా ముద్రించుకుపోయాయి; 1971 డిసెంబరు 16, మధ్యాహ్నం 12. 10 నిమిషాలు. నేను వెంటనే హెలికాప్టర్లో అగర్తల వెళ్ళి అక్కడినుంచి డక్కా వెళ్ళాలి. సిల్హెట్ ప్రాంతంలో 8, మౌంటెన్ డివిజన్తో తలపడి లొంగిపోనున్న 59 మౌంటెన్ బ్రిగేడ్ లొంగుబాటు ప్రక్రియను నిర్వహించమని బ్రిగేడియర్ సి.ఏ.క్విన్ ను ఆదేశించి, నేను అగర్తలకు బయల్దేరిపోయాను. అగర్తలలో నా కోర్ కమాండర్ (నాలుగు కోర్ కమాండింగ్ జనరల్ ఆఫీసర్) లెఫ్టినెంట్ జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా (తూర్పు కమాండ్ కమాండింగ్ ఛీఫ్), అతని సిబ్బంది కూడా అక్కడ కనిపించారు. అతను మా అసాధారణ విజయానికి కోర్, డివిజినల్ కమాండర్లను ప్రశంసించాడు. అప్పటికప్పుడే మాకు మా విజయాన్ని గురించిన స్పృహ ఏర్పడి, ఆనందిస్తున్న తరుణంలో ఆయన ప్రశంస మరింత సంతోషాన్ని కలిగిం చింది. మేమంతా హెలికాఫ్టర్లలో డక్కాకు ప్రయాణమయ్యాం. తేజ్ గావ్ విమానాశ్రయంలో మేము దిగుతుండగా, భారతీయ వైమానిక దళం జరిపిన యుద్ధం వల్ల ఆ విమానాశ్రయా నికి కలిగిన హానిని కళ్లారా చూశాం.
విమానాశ్రయంలో పాకిస్తానీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏ.ఏ.కె. నియాజీ, ఆయన సిబ్బంది మాకు స్వాగతం పలికారు. సైనిక కమాండర్ అటు పాకిస్తానీయులు, ఇటు డక్కాను సాధించిన భారతీయ దళాలు - రెండిటి వందనాలు స్వీకరించారు. విమానా శ్రయంలో డక్కాను స్వాధీనం చేసుకున్న భారతీయ సైన్యంలోనివి, అటు వారు లొంగి పోవడానికి నిర్ణయించిన రమణ్ మైదాన్ లోనివి కొన్ని ట్యాంకులు, సేనలు అక్కడ
ఉన్నాయి. . మేము మైదానానికి వాహన పరంపరలో వెళ్తుండగా దారి పొడుగునా వేలాది కంఠస్వరాలు 'జై బంగ్లా' 'జై ఇండియా', 'జై ఇందిరాగాంధీజీకీ జై' 'షేక్ ముజిబుర్ రహమాన్కో జై', 'జై, ముక్తిబాహినీ' అని నినాదాలు చేస్తున్నాయి. ఆ 'జై' అనే పదాన్ని బెంగాలీలకు సహజమైనట్లు 'జోయ్' అని పలికారనుకోండి. అందులోనూ పాకిస్తాన్ విధించిన కర్ఫ్యూ ఇంకా అమల్లో ఉన్నప్పటికీ స్వేచ్ఛగా నినాదాలు చేశారు...........................