గుంటూరు గోంగూర
“అల్లుడూ! నీతో అర్జంటుగా మాట్లాడాలి." ఫోన్లో చెప్పాడు దామోదరం,
" చెప్పుమామా!" అన్నాడు రంగనాయకులు.
" ఫోన్లో కాదు. పర్సనల్ గా మాట్లాడతా!"
" కొత్త కమీషనర్ వచ్చాడు మామా! ఆయనకంతా కొత్త. అన్నీ నన్ను బ్రీఫ్ చేయమంటాడు. ఆఫీసులో లేటవుతుంది మామా! ఆదివారం కలుద్దాం."
"లేటైతే ఇంకా మంచిది. ఆఫీసునుంచి సరాసరి కృష్ణా హోటల్ కి వచ్చేయ్! గుటక లేస్తూ మాట్లాడుకుందాం."
"సరే మామా!" అన్నాడు రంగనాయకులు.
కమీషనర్ ఏడింటికి కారెక్కి వెళ్ళిపోయాక వూపిరి పీల్చుకున్నాడు రంగనాయకులు. సెల్ఫోన్లో దామోదరం యిచ్చిన మెసేజ్ కనిపించింది. 'బయల్దేరా' అని మెసేజ్ ఇచ్చాడు.
రంగనాయకులు వేళ్ళేసరికి అక్కడ ఇంకా నలుగురు వున్నారు దామోదరంతో
-వీళ్ళంతా ప్రముఖ కాంట్రాక్టర్లు. రంగనాయకులు మా అల్లుడు." అని అందర్నీ పరిచయం చేశాడు దామోదరం.
వాళ్ళు రంగనాయకులకు తెలిసినవారే.
"మా అల్లుడు అనడమే గాని పిల్లనిచ్చావా ఏమైనానా మామా!" అన్నాడు రంగనాయకులు నవ్వుతూ.
"నువ్వడిగితే పిల్లని ఎందుకియ్యనూ? అది ఇప్పుడేగా ఎల్.కే.జీ లో చేరింది. డిగ్రీ పూర్తి చెయ్యనీ, నీకే ఇస్తాను. ఈ లోపల మీ ఆవిడకు విడాకులు ఇవ్వు."
దామోదరం మాటలకు అంతా పకపకా నవ్వారు. రంగనాయకులు, దామోదరం చిన్నప్పటినుంచి ఒకే కాలనీలో పెరిగి పెద్దయ్యారు. చుట్టరికం ఏం లేకపోయినా అంతకంటే బాగా కలిసిపోయారు.
"మామా! మీటింగ్ అజెండా ఏంటి?" అడిగాడు రంగనాయకులు. | "మున్సిపాల్టీలో బి.టి. రోడ్ల పనుల
కోసం మా కాంట్రాక్టర్లు అంతా రింగ్ అవ్వాలని ' నిర్ణయించుకున్నాం." చెప్పాడు దామోదరం,
"లోగడ ఆన్లైన్ లో ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇచ్చారు కదా మెయింటెనెన్స్ డివిజన్ వాళ్ళు.".................