నైపుణ్యం ఋష్యశృంగ మహర్షిలా అలవర్చుకోండి
కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య. అది చాలా సంపన్నమైన దేశం. ప్రజలు ఆరోగ్యవంతులు. కోట దృఢమైనది (ప్రస్తుతం అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఉంది). ఆ రాజ్య సైనికులు గొప్ప వీరులుగా ప్రసిద్ధులు. అయోధ్య ప్రజలు తమ రాజ్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంటారు. ఘనత వహించిన తమ మహారాజుల పట్ల వారికి గొప్ప గౌరవం. సంపద్వంతమైన తన రాజ్యాన్ని, దినదినాభివృద్ధి చెందుతున్న పౌరులను చూసుకొని దశరథ మహారాజు ఎంతో సంతోషిస్తున్నాడు. కాని ఆయన ఎల్లప్పుడూ అయోధ్య భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉన్నాడు: తనకు అత్యంత ప్రియమైన అయోధ్యను తన తరువాత ఎవరు చూసుకుంటారు? తాను తన తర్వాత రాజ్య బాధ్యతలను ఎవరికి అప్పగించాలి?
రాజుగారు ఎప్పుడూ విచారంలో ఉండడం చూసి వసిష్ఠ మహర్షి ఆయనకు ఒక సలహా ఇచ్చాడు. సంతానం కోసం మహారాజు పుత్ర కామేష్టి యజ్ఞం చేయాలని సూచించాడు. సంతానం కోసం చేసే యజ్ఞాలలో ఈ యజ్ఞం చాలా శక్తిమంతమైనదని.................