పంచప్రాణాల్లో ఒకదాన్ని తెలుగు సాహిత్యానికి కేటాయించానని అంటూ ఉండే వీరు, వృత్తిరీత్యా రైల్వే వైద్య విభాగంలో ఫార్మసీ ఛీఫ్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ప్రవృత్తి రీత్యా సాహితీ పిపాసకులు. కవి, రచయిత, విమర్శకుడిగా గత పాతికేళ్ళుగా దాదాపు అన్ని తెలుగు పత్రికలలో శతాధికంగా ఆధ్యాత్మిక, సాహిత్య వ్యాసాలు, పుస్తక సమీక్షలు, కవితలు, కథలు, యాత్రా కథనాలు వ్రాసి ప్రకటించారు.
నవ్య వారపత్రికలో 13 వారాల పాటు ప్రచురణ జరిగింది. ఇవి శృంగేరి గురుపరంపరలోని ఆచార్యుల జీవితాల్లోని ఆసక్తికర ఘట్టాలు కథా రూపంలో అందించిన రచన.