భారత స్వతంత్ర పోరాట యోధుల్లో అగ్రగామి చంద్రశేఖర్ ఆజాద్. బాల్యం లోనే పాఠశాల విద్య ముగింపుతోనే స్వాతంత్ర ఉద్యమంలో చేరి ఆయుధం ద్వారానే స్వతంత్రం అని నమ్మినవాడు. భగత్ సింగ్ సహచరుడు అసెంబ్లీ బాంబు కేసులో కూడా నిందితుడు. భగత్ సింగ్ పట్టుబడి ఉరి తియ్యబడగా చంద్ర శేఖర్ ఆజాద్ తప్పించుకుని సహచరులను కోల్పోయి తీవ్ర ప్రయత్నం చేసి చివరికి కాన్పూరు లోని ఆల్ఫైడ్ పార్కులో పోలీసు లతో తలపడి వారికి బందీ కావడం ఇష్టం లేక చివరి బులెట్ తో తనకు తానే కాల్చుకుని మరణించిన ధీశాలి.