ఉపోద్ఘాతము
నేను మైసూరున జరిగిన (1935 డిసెంబరు) 'ప్రాచ్యవిజ్ఞాన మహాసభ'కు (Oriental Conference) వెళ్ళి తిరిగివచ్చుచూ 'చిత్తూరు'న నాఁగి (ది 2.1.1936) శ్రీ డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి M.A. D.LT. గారిని జూడనేఁగినపుడీ 'రాజసూయ' ఆ విషయక ప్రశంస కలిగినది. ఆయంశ మిపుడీ గ్రంథమునకు శ్రీ రామలింగారెడ్డిగారు = వ్రాసిన తొలిపలుకు వలనను, 'కృతిసమర్పణము - స్వచరిత్రము' అని దీనిలో నేను * వ్రాసిన 'ద్విపద' భాగమువలనను దెలియఁగలదు. కాని నేను వాల్తేరున శ్రీ రెడ్డిగారిని మరల జూచినపుడు వారు తిరిగి పైదానినిగూర్చి ప్రశంసించిన తరువాతనే (ది.9.3.37) 10 దీనిని వ్రాయఁ బ్రయత్నించితిని.
మహాభారతమునకు 'పంచమవేద'మను సంజ్ఞ కలదు. కాని యేకారణములచే నది థ పంచమవేదమైనదియు నింతవఱ కెవరును వివరించినటులఁ గాన్పింపదు. నేను నా మహాభారత చరిత్రము యొక్క ద్వితీయ ముద్రణమున నాకప్పటికి మహాభారతమునఁ దోఁచిన పంచమ వేదాంశములనందు వ్రాసితిని. ఇంకను శోధింపఁగాఁ దోఁచిన మరికొన్నిటినీ 'రాజసూయ రహస్యము'న వివరించియున్నాను. ఎవరేని ఇంకను నాలుగు వేదములతో మహాభారతములోని యంశములఁ బరిశీలించినయెడల నెన్నియో భారతమున వేద విశేషములు కాన్పింపఁగలవు.
మఱియు మహాభారతములోని ఇతిహాస విషయాదులఁగూర్చి పెక్కండ్రు పెక్కు గ్రంథములను వ్రాసియున్నారు. నాకు 'వెలిసిన కొన్నిటి' 'మహాభారత చరిత్రము' అను గ్రంథరూపకముగా వ్రాసి ప్రకటించిన యంశమును నా సోదరాంధ్రదేశీయులకుఁ బెక్కండ్రకు దెలిసియేయున్నది.
మహాభారతాంతర్గతమగు మోక్ష' శాస్త్రాంశములను 'భగవద్గీతాభాష్య' రూపకముగా మతత్రయ ప్రవర్తకులును జగద్విదిత గ్రంథములను రచించియున్నారు. అంద........................