వెనుదిరిగి చూస్తే!
శ్రీకృష్ణదేవరాయలవారి వైభవ చిహ్నాలుగా చెప్పుకుంటున్న కట్టడాలు హంపీలో ఎన్ని ఉన్నప్పటికీ, సకలకళాశోభితము, సర్వాలంకార భూషితము, సౌందర్యవంతము, అత్యద్భుతము, సామాన్యులకు దురవగాహము, అన్నింటా మిన్న అయిన కళాఖండాలు రెండు. అందు చరిత్రగర్భంలో కలిసిపోయి, విదేశీయ యాత్రికుల గ్రంథాలలో సువర్ణాక్షరాలుగా నిలిచిపోయిన రాయలవారి అంతఃపురం మలయకూటం' మొదటిది. తెలుగు భాష, తెలుగుజాతి ఉన్నంతవరకు కవిరాయనికి చిరయశస్సుని నిలుపగల అపూర్వకవితాగంధిలమైన తెలుగు ప్రబంధం "ఆముక్తమాల్యద' రెండవది. ఆముక్తమాల్యద ఓ అద్భుత లోకం అనుకుంటే, దాని లోపలికి ప్రవేశించి, అందలి అపురూపమైన ఘట్టాలను ఈ 'రాయరత్న మంజూష'గా తయారు చేయగలిగిన నా జీవిత నేపథ్యాన్ని, నా జీవనగమనంలో సంభవించిన అనూహ్య సంఘటనలను రాసిపెట్టాలనే తహతహతోనే ఈ నాల్గు.............