నవులూరి వెంకటేశ్వరరావు వువాచ
అరసయ్యన డెబ్బైయ్యవ దశకపు విశాఖపట్నం అందంగాను ఆరోగ్యంగానూ వుండేది. అప్పటి పాతపట్నపు ఖరుకుదనం , మురికయుగం లో ఆత్మీయత వుండేవి. అది వ్యక్తికి వూరికి సంబంధించినవి, మధ్యతరగతి మురికివాడ నివాసం మానసిక మార్పిడిటికి దారితీస్తుంది, అది సృజనాత్మకకు అందమైన సాహిత్య కోణాన్ని సమకూర్చుతుంది.
వెల్చేరు కధలలో అది గోచరిస్తుంది, మనిషి చీకటి లోతులను అది ఆవిష్కరిస్తుంది. ఈ రచయిత వస్తుత: సంప్రదాయవాది, దాని నీడ యెందుచేతనే అతని సాహిత్యం మీద పడలేదు అతను శస్త్రచికిత్సకు వాడిన కత్తికి అది అడ్డు రాలేదు. మన నమ్మకాలకు అతీతంగా సత్యం నిలబడి చూస్తూవుంటుంది. దానికి కొన్ని సార్లన్నా లొంగక తప్పదు. తత్వ విచారణ చేసేటప్పుడు, యేడుపు కథలలో కధలలో కూడా బ్లాక్ హ్యూమర్ మిళితమై వుంటుంది విడదీయరాని విధంగా........!
నవల్లో ముఖ్యమైనది సింగిల్ డైరీ.. చక్కని శైలితో చకచక సాగుతుంది. నా కన్నా మంచి విమర్శకులు ఈ నవలని అంచనా వేసి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానంలో కూర్చోబెట్టవలసిన అవసరం ఎంతో వుంది. ఇది భావోద్వేగ పరంపర ప్రవాహం యేది దాచుకోకుండా వొదిలేసినది. మొదటిసారిగా అచ్చులో రావడం వలన మరి కొంతమంది చదివి ఆలోచించే అవకాశం వచ్చినది, తానావారు దీనికి బహుమతి ఇచ్చారు. మంచి చెడు లేవన్న అంశం కేంద్రబిందువుగా అల్లిన నవల, వివిధ సంఘటనలు వ్యక్తులు..................