బమ్మెర పోతనామాత్యుని
శ్రీమహాభాగవతము
తేనెలూరే తేట తెలుగు వచనంలో
రచన: డా. అద్దంకి శ్రీనివాస్
చేతులతో శివుడిని పూజించకపోతే, నోటితో హరికీర్తిని గానం చేయకపోతే, దయ, సత్యం మొదలైన గుణాల్ని అలవరుచుకోకపోతే అలాంటి వ్యక్తులు పుట్టడం దేనికి ? అది తల్లుల కడుపులకు చేటుకదా ! అని భావించిన పరమ భక్తాగ్రేసరుడు బమ్మెర పోతన. ఏది జీవిత సార్థక్యమో తాను తెలుసుకొని అందరికీ అందించిన మహానుభావుడతడు.
శ్రీమన్నారాయణుడి కథల్ని రచించాలన్న కుతూహలంతో - భాగవతాన్ని తెలుగులోనికి అనువాదం చేసిన సహజకవి.
నేటి తరం పాఠకులకు అర్థమయ్యేలా అతి సులభశైలిలో వ్యావహారిక భాషలో పోతన భాగవతానికి వచన రూపం ఈ పుస్తకం.