దర్శనము
ఎచ్చట మొదలైనదో : ఎచ్చటికి పోవుచున్నదో ఈ కాలవాహిని తిరిగిన చులుపులవంటి సన్నివేశములు కొన్ని నాటికి యాదృచ్ఛికము అనిపించి రమునకు తమలో గర్భితమైయున్న ఒక నియతిరహస్యమునకు క్రమముగా వెలువ రించి ఆశ్చర్య మాపహిల్ల జేయుచుండును.
తెలుఁగులో కాశీఖండావతరణ మొకటి యట్టిది. ఆంధ్రమహాభారతము అవత రించిన నాలుగువందల యేండ్లకు మరల గోదావరి యొడ్డుననే కాశీఖండము పుట్టినది. అజ్ఞేయమైన నియతిరహస్యము. ఈ ప్రయోజనాసిద్ధికే కొండవీటినుండి శ్రీనాథుని రాజమహేంద్రమునకు తీసికొని వచ్చి పరమ మాహేశ్వరుఁడైన వీరభద్రా రెడ్డి మధ్యమందు నెలకొల్పియుండును.
కొండవీటి రెడ్డి రాజ్యము అస్తమించినది. తక్కిర్తిపతాక శృంగారనైషధము వాఙ్మయందు వెలుఁగులు చిమ్ముచున్నది. రాజమహేంద్రవరములోని రెడ్డిరాజ్యముకూడ అంతర్హితమై పోయినది. వాఙ్మయక్షేత్రమునందు సుప్రతిష్ఠితమైన తత్కీర్తిస్తంభము శ్రీనాథుని కాశీఖండము దేశకాలముల ఎల్లలను చూచుచున్నది.
ఇచ్చటి యీ మృత్తికకు... కాశీక్షేత్రమందలి మృత్తికకు ఏదియో సాజాత్యము ఉండి తీరవలెను. లేనిచో ఆ క్షేత్రానుభావము అజరామరమైన ఆంధ్ర కావ్యముగా ఇచ్చటి నేలలో మొలిచి చెట్టుకట్టి ఆంధ్రజాతికి అవిరళముగా అవిముక్తక్షేత్రసేవా ఫలమును ప్రసాదించుచుండుట తటస్థించదు. శ్రీనాథుని కాశీఖండమును చదివి కొనియే మన పూర్వులు కాశీక్షేత్ర యాత్రాఫలమును పొందియుందురు. ఆ దినము లలో కాశీయాత్రకు పోవుట కష్టసాధ్యమైన విషయము, కాశికి పోయినవారు కాటికి పోయినవారు సమము' అన్న సామెత యీనాటిది కాదు.
ఈ సందర్భములో ప్రస్తావింపఁదగిన యనుభవ మొకటి యున్నది. ఇచ్చటి నుండి కాశికి పోయి. అచ్చట కొన్నాళ్ళుండి తిరిగి యిచ్చటికి రాగా.. ఈ రాజ మహేంద్రవరము కాశివలెనే కనిపింపఁదొడఁగెను. కొన్నాళ్ళవఱకు ఆ దర్శన మట్లే.....................