నన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
అంటు
ఉత్తరంలోని విషయాల్ని మరోసారి మననం చేసుకొన్న కొండన్నకు ఆనందంతోపాటు ఆత్రుత కూడా ఎక్కువైంది. చేని దగ్గర్నుంచి ఎప్పుడెప్పుడు ఇంటికి చేరుకుందామా అని ఆరాటంగా ఉంది.
గగనం దిక్కు చూశాడు.
మబ్బుల చాటున పొద్దు మసకేసి ఉంది. మధ్యాహ్నానికో, సాయంత్రానికో వంగేట్టుంది. దేవమూల అప్పుడప్పుడూ ఉరుముతూ ఉంది.
ఉత్తరంలో ఉరిమితే ఖచ్చితంగా వానొస్తుందట!
అందులోనూ ఇది రైతులకార్తె.
కొండన్న గుండెల్లో సన్నని జలదరింపు మొదలైంది.
వాన ఈ కూలీల్తో సాయంత్రం దాకా సంతనగా పన్జేయించుకుంటేగాని చేనంతా పత్తి విరవటం
అయిపోదు.
మధ్యలో వానొస్తే పత్తి అంతా మట్టిపాలు.
నిండు రోహిణికార్తెలో ఈపైరు మొలిపించుకునేందుకు తానెంత అగచాట్లు పడింది.
కళ్లముందు మెదిలింది.
సర్కారోళ్ళు ఏడెకరాలు పట్టా ఇచ్చి ఉచిత బోరుబావి తవ్వించారు గాబట్టి పత్తిపైరు పెట్టడం. సాధ్యమైంది. లేకుంటే తామెక్కడ? ఈ ఎండాకాలం పైరెక్కడ?
ఈభూమి, బోరుబావి తను పొందడంలో స్టీఫెన్ సహాయం కూడా కొంత ఉంది. దళితుల సహాయార్ధం అతను ఎంతో పాటుపడుతున్నాడట.
పక్క తాలూకాలోనే ఏదో ఊర్లో అగ్రవర్ణాల వారికి చెందిన మంచినీటి కుంటలో హరిజనులు కూడా గొంతు తడుపుకునేందుకు ఎదురైన ఆటంకాల్ని తొలగించేందుకు కలెక్టర్ తోటి వస్తున్నారుట.
ఆసందర్భంగా తన్ను కలుసుకొనేందుకు ఈరోజు వస్తానని రాశాడు.
పాలెమంతా తిరిగి తిరిగి రంగనిదగ్గర పెద్ద కోడిపుంజు నొకదాన్ని నూర్రూపా యలకు బేరమాడి పట్టుకొచ్చి ఇంట్లో గంపకింద వేసొచ్చాడు కొండన్న. స్టోరు బియ్యం....................