శ్రీమతే రామానుజాయనమః
శ్రీమద్రంగనాథ గురవేనమః
తిరుప్పావై
(i) ధ్యానం:
నీళా తుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతిశతశిరః సిద్ధమధ్యాపయంతీ |
స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః॥
(పరాశర భట్టర్ గోదాదేవికి నమస్కార రూపంగా సాయించిన శ్లోకం)
పరమార్థ తత్త్వ సంగ్రహ మాలిక:
నిండు కొండల వంటి నీళాదేవి ఘన వక్షస్థలమందు
మత్తుగా నిద్రించిన మాధవ సింహమును
నిద్ర లేపెను గదా విష్ణుచిత్తుల పుత్రి-మధుర గాత్రి!
విరి మాలలు ధరించి అర్పించే విష్ణుదేవు
మెప్పించి మరుజనకు బంధించే భక్తితో
పరతంత్రులు జీవులని పరమాత్మకే బోధించె!
వేదాంత రహస్యము చిలికి వెలికి తెచ్చె-
జాగృతపరచె హృది పరమాత్మ తత్వమును!
బలాత్కారముగ భగవద్గుణానుభవము పొంది
రంగనాథుని రమణిగ రమించె రంగనాయకి!
ఆరాధ్య దైవమాయె ఆముక్త మాల్యద !................