(బొమ్మలు చెప్పిన కమ్మని కథలు. (ప్రారంభం)
కైలాసగిరిపై సదాశివుని పాదపూజ ముగించిన పార్వతిదేవి. "స్వామి ఏదైనా కథ చెప్పండి" అన్నది.
"దేవి నీకుతెలియని కథలా! నీ వరప్రసాదితుడు విక్రమార్కునికి ఇంద్రుని ద్వారా లభించిన మణిమయ స్వర్ణ నెమలిపింఛ ఆకృతి కలిగి ముపై రెండుమెట్లు కలిగి ప్రతిమెట్టుకు సాలభంజికలు (బొమ్మలు) కలిగిన ఆ సింహాసనం భోజమహారాజు అధిష్టించే ప్రయత్నంలో మెట్టుకో బొమ్మచెప్పిన కథలు చెపుతాను విను.
భూలోకంలో మోక్షప్రదాయమైనవిగా పేరుపొందిన అయోధ్య-మధుర-హరిద్వార్ - కాశీ కంచి అవంతిక ద్వారక అనేవి సప్తనగరాలు. అవంతికి మరోపేరు "ఉజ్జయిని" అనే రాజ్యం ఉంది. దీనికి మరికొన్ని పేర్లు ఉన్నట్లు స్కందపురాణంలో వివరింపబడింది. అవి కనకశృంగ కుశస్థలి పద్మావతి కుముద్వతి-వైశాలి-ధరావురి అనే పేర్లు ఉన్నాయి.
ఈ రాజ్యాన్ని సకలగుణ సంపన్నుడు మహావీరుడు అయిన "భోజరాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజ్యపాలిమేరలలోని గ్రామాలపై తరచూ అడవిమృగాలు దాడిచేయడంతో అక్కడి ప్రజలు భోజరాజుకు తమకష్టాలు చెప్పుకున్నారు. తనపరివారంతో అడవిలోని జంతువులను వేటాడుతూ ఉండగా, అక్కడకు కొద్దిదూరంలో సజ్జుచేలో మంచపై పక్షులను వడిసెలతో తరుముతున్న బ్రహ్మణుని చూసి నీళ్లు అడుగుదామని ఆ చేలోకి భోజుడు తనపరివారంతో వెళ్లాడు.
భోజమహారాజును, అతని పరివారాన్ని చూసిన మంచపైన వ్యక్తి "దయచేయండి మహారాజా ఈ సజ్జకంకులు, ఇక్కడి.......................