కాలాతీత కథకుడు
గురజాడకి correct extension చాసోనే అన్నాడు ప్రముఖ కవి శివారెడ్డి. ఈ మాట ముమ్మాటికీ నిజం. ఎందుకంటే?
గురజాడ తరువాత ఆయన అడుగుజాడని అక్షరాలా అనుసరించింది చాసోనే.
గురజాడ అడుగుజాడను తదనంతర కవులు అనుసరించి ఉంటే ఆధునిక తెలుగు సాహిత్యంలో భావకవిత్వ ధోరణికి అవకాశం ఉండేది కాదన్నారు ప్రముఖ విమర్శకుడు వెల్చేరు నారాయణరావు.
కానీ ఆ కాలంలో భావ కవిత్వానికి భిన్నంగా సామాజిక స్పృహతో కవిత్వం రాసాడు చాసో.
భావ కవిత్వం పట్ల తన నిరసనను తన కవిత్వంలోనూ 'ఊహా ఊర్వశి' లాంటి కథల్లోనూ అవకాశం ఉన్నంత వరకు ఎండగట్టాడు.
“గాలిలో కనరాని గడుసు దెయ్యాలు భూ దివమ్ముల మధ్య ఈదులాడుతున్నాయి” శ్రీశ్రీ అంటే
"భవిష్యత్తు గగమ్య గోచరంగా ఆకాశం
అక్కడక్కడాశల్లా చుక్కలు.
ఆ మధ్య నక్షయపాత్రలా గర్భ చంద్రుడు.
బూజెక్కి గూడు కట్టాడు.
శంపాలతాదేవి పాశ్చాత్య గానాన్ని పాటగా రాస్తే
ఉరుముతూ ఊగేయి ఊరగాలులు.
తిన్నవాడెవడోనొ తేన్చి 'నారాయణ' అని ఆవులిస్తే
కులాసాని కూసింది గూబ గుడి సేటు (1946) అని చాసో అన్నాడు. పాశ్చాత్య కాల్పనిక కవిత్వం ప్రభావంతో భావకవులు ఊహల్లో విహరించడాన్ని నేల విడిచి నడయాడే తత్త్వంగా ఈసడించాడు.
'బూజెక్కి గూడు కట్టాడు' అంటూ ఒక నీచోపమానాన్ని ప్రయోగించడంతో చాసో భావ కవిత్వం పై తన ఏహ్యభావాన్ని వ్యక్తం చేశాడు...........................