పరిచయం
భారత రాజ్యాంగం తన విముక్తి వాగ్దానాలను నెరవేర్చిందా?
హర్ష్ మందర్
స్వతంత్ర భారత రాజ్యాంగ భావనలపై ప్రముఖ మేధావులు రాసిన పదకొండు చిన్న వ్యాసాల పరంపరలో చివరి పుస్తకాన్ని రాసేందుకు ఆనంద్ తెల్ుంబైను ఆహ్వానించడం సముచితమని మేము భావించాము. ఆయన భారతదేశపు అత్యంత గౌరవనీయ మేధావులలో ఒకరు. ఇటీవలే 'మనస్సాక్షి' ఖైదీ (prisoner of conscience)గా ఆయన జైలు జీవితం అనుభవించారు. మేము తీసుకు వచ్చిన ఈపుస్తక పరంపరలో రాజ్యాంగాన్ని నాయకులు ఎలా ఊహించారు, ఎలా చర్చించారు, ఎలా రచించారు అనే అంశాలను మేము పరిశీలించాము. అలాగే లౌకికత్వం, సామ్యవాదం, ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగ దృక్పథాన్ని, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సమాఖ్య వ్యవస్థ, శాస్త్రీయ దృక్పథం వంటి మూల ప్రతిజ్ఞలను కూడా విశ్లేషించాము.
భారతదేశంలోని అత్యంత అణగారిన ప్రజలు రాజ్యాంగం నుండి ఏం ఆశించారు; గౌరవప్రదమైన, ఆశాజనకమైన జీవితం కోసం వారు తమ హక్కులను పొందడంలో ఇది ఎంతవరకు తోడ్పడింది అనే అంశాలపై స్పందించమని మేము తెలుంబైను కోరాము.
ఆయన చేసిన నిర్ధారణలు చాలా తీవ్రంగా, ఘాటుగా, రాజీ లేకుండా ఉండి మనల్ని లోతుగా ఆలోచింపజేస్తాయి.
పీఠికలో ఉన్న ఆశయాలకు, ప్రస్తుత భారతదేశ వాస్తవాలకు మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉందని తెలుంబై అభిప్రాయపడతాడు. “స్వేచ్ఛ ప్రమాదంలో పడింది....................................