• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Rajarikapu Yodhulu
₹ 299

లలితాదిత్య ముక్తాపీడ

కాశ్మీరు ప్రపంచ పటంలో ఉంచిన సామ్రాజ్య నిర్మాత (క్రీ.శ. 724-760)

చుతో కప్పబడిన పర్వతాలు పచ్చని మైదానాలను కలుసుకునే అందమైన

మంకాశ్మీర్ లోయలో, లలితాదిత్య ముక్తాపీడ అనే యువ రాజకుమారుడు కర్కోట వంశంలో జన్మించాడు. ప్రారంభం నుండే, లలితాదిత్య గొప్పతనానికి అర్హుడని స్పష్టమైంది. బాలుడిగా ఉన్నప్పుడే, అతని తీక్షణమైన మేధస్సు మరియు తీరని కుతూహలం అతన్ని ప్రత్యేకంగా నిలిపాయి.

రాజ దర్బారులో, ఇతర పిల్లలు ఆడుకుంటున్నప్పుడు, లలితాదిత్య పండితులు పక్కన కూర్చుని, ప్రాచీన రాజుల యుద్ధాల కథలను వినేవాడు. 'నాకిది చెప్పండి, గురువర్యా” అని ఒకసారి రాజసభ లోని విశ్రాంత అనే జ్ఞానిని అడిగాడు. ఆశ్చర్యంతో విశాలంగా విప్పారిన కళ్ళతో అడిగాడు. 'రాజ్యాలు ఎందుకు ఉదయిస్తాయి మరియు పతనమవుతాయి?'

మహాజ్ఞానిగా ప్రసిద్ధి చెందిన విశ్రాంత చెప్పాడు. 'రాజ్యాలు ధైర్యంతో ఉదయిస్తాయి. అహంకారంతో పతనమవుతాయి. పాలకుడు తనకంటే ముందు తన ప్రజల గురించి ఆలోచించాలి. యువరాజా, దీన్ని గుర్తుంచుకో.'

లలితాదిత్య మనసులో ఈ మాటలు బలంగా నాటుకున్నాయి. అతని విద్య చాలా కఠినమైనది, ఆచరణాత్మక పాఠాలకు పాలనపై లోతైన జ్ఞానంతో జోడించిన విద్య అది. అనుభవజ్ఞులైన సేనానుల వద్ద యుద్ధవిద్యలు నేర్చుకున్నాడు, ఖడ్గవిద్య, విలువిద్యలలో ప్రావీణ్యం సంపాదించాడు. కానీ అతని దృష్టి పాలనా వ్యవస్థ మీద, రాజనీతిని అర్థం చేసుకోవడం మీదనే ఉండేది. తరచుగా తన తండ్రిని రాజ్య 1 వ్యవహారాలలో రకరకాల ప్రశ్నలు వేసి జవాబులు తెలుసుకునేవాడు.

ఒక రోజు, లలితాదిత్య వేట నుండి తిరిగి వస్తున్నప్పుడు, పంట కాలువను బాగు చేసుకోవడానికి తంటాలు పడుతున్న రైతులను చూసాడు. వెంటనే గుర్రం దిగి,.........................