నిత్యా ... ప్రవాహినీ...
సుమారు అర్థ శతాబ్దం క్రితం వరకూ తెలుగు వచ్చిన వాడు అంటే కొన్ని వందల పద్యాలు నోటికి వచ్చినవాడు అని అర్థం. వాటిలో గురు ముఖతః నేర్చు కునేవీ, పుస్తకాలు చూసి వల్లించేవీ బహు కొద్ది. ఎక్కువ భాగం మౌఖికంగా ఆ నోటా ఆ నోటా విని స్వాయత్తం చేసుకునేవే!
రెండు మూడేళ్ల చిరుత ప్రాయంలోనే తల్లిదండ్రులు పిల్లల్ని ఆరుబయట వెన్నెల్లో పక్కలో పడుకోబెట్టుకుని, 'చేత వెన్నముద్ద, చెంగల్వ పూదండ', 'శ్రీ రాముల దయచేతను', 'ఏనుగు చర్మంబు ఏడాది ఉదికినా', 'ఎప్పుడు సంపద గలిగిన' లాంటి పద్యాలు నోటికి వచ్చేదాకా చెబుతూ ఉండడంతో విద్యాభ్యాసం ఆరంభ మయేది. క్రమంగా ఏడెనిమిదేళ్ల వయస్సు వచ్చేసరికి మగ పిల్లలకి 'గజేంద్ర మోక్షం' దాకానూ, ఆడపిల్లలకి రుక్మిణీ కళ్యాణం దాకానూ కొన్ని వందల పద్యాలు నోటికి వచ్చేవి. వయస్సు పెరిగిన కొద్దీ ఆ పద్యాలు తిరిగి తిరిగి మననం చేసుకుంటూ, మిత్రుల దగ్గిరా, బంధువుల దగ్గిరా మళ్లీ మళ్లీ చదువుతూ వాటి లోని చమత్కారాల్నీ, త్రికా లాబాధ్యమైన నత్యాల్నీ ఎక్కు వెక్కువగా ఆకళింపు చేసుకుంటూ వచ్చేవాళ్లు!
అభినేయ చాటువు :
1940 ప్రాంతంలో కూడా సాయం సమయాల్లో యువ మిత్రులు ఎక్కడ చేరినా వినోదం కోసం తమకి నోటికి వచ్చిన చమత్కారమైన పద్యాలు ఇతరులకు చదివి వినిపిస్తూ ఉండడం, వాటిలో ఏవైనా కొందరికి తెలియనివి ఉంటే, వాటి చమత్కారానికి ముగ్ధులై అప్పటి కప్పుడే వాళ్లు వాటిని ధారణ పట్టేస్తూ ఉండడం జరిగేది. అలాంటి ఒక యువ గోష్ఠిలో ఒకసారి ఒక మిత్రుడు ఉన్నట్టుండి. "తెలుగులో అభినయం జోడిస్తే గాని అర్థం కాని పద్యాలు కూడా ఉన్నయి - మీ రెప్పుడైనా విన్నారా ?" అన్నాడు. మిత్రులు ఆశ్చర్యపోతూ, “ఏదేదీ చదవండి!" అన్నారు. ఆయన ఈ పద్యం చదివాడు:
ఉ. రాజిత కీర్తిశాలి అగు రాయవి భాస్కరు వేడబోయినవ్
ఆజికి ఇట్లమని, పరుని అలికి ఇట్లను, అర్థి కిట్లనన్ ;
తేజము పెంపు లేని కడు దీనవి హీమని వేడబోయివన్
ఆజికి ఇట్లనవ్, పరుని ఆలికి ఇట్లన, అర్థి కిట్లనవ్. (క-81)................................