రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రాలలో ఒకటి. భౌతిక ప్రపంచాలలో మనం చూసే వస్తువులన్ని రసాయన శాస్త్ర పరిశీలనకు లోనైనవే. సహజ వస్తువుల పద్ధతులను అనుకరించే ప్రయత్నాలు అన్నీ రసాయన శాస్త్రవేత్తల శాస్త్రీయ కార్యకలాపాలలో భాగాలే. ఈ శాస్త్రం వ్యాప్తి చాలా బహుళమైంది.
కొన్నికోట్ల సంవత్సరాల కిందట భూమిపై జీవకణాలు ఉత్పన్నమై, వాటి కలయిక ద్వారా వృక్ష జాతులు, క్రిమి కీటకాదులు, జంతుజాలం ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. క్రమేణ జీవకణ పరిణామ ప్రభావం ద్వారా సృష్టిలో ఉత్తమ స్థానం ఆక్రమించే మానవ వర్గం ఏర్పడిందని పరిణామ వాదులు నమ్ముతున్నారు. కొంచెం తేడాతో భారతీయ వైజ్ఞానికులలో పరిణామవాదుల ఆలోచనలు కూడా దీనిని పోలివున్నాయి. తన తెలివితే టలు, ఆలోచన శక్తి ద్వారా మానవుడు తన చుట్టుపట్ల దొరికే వస్తువులను తన జీవనాధారం కొరకు తన మనుగడకు ఉపయోగించడానికి ప్రయత్నించడం రాతి యుగం నాడే మొదలుపెట్టాడు. ఈ ప్రయత్నాలే భౌతిక శాస్త్రాల పుట్టుకకు మూలబీజాలుగా మారాయి. రోగ చికిత్సలో వాడే ఔషధాలు భారతదేశమంతా ఆయుర్వేద విస్తృతికి పునాదులు వేశాయి. నిత్యకృత్యాలకు అవసరం అయ్యే పనిముట్లు తయారుచేయడం, గృహ నిర్మాణం, వ్యవసాయం, చేపలు పట్టడం ఆహార పదార్థాలను వండడానికి అవసరమయ్యే పాత్రలు, ఇతర ఉపకరణాలు తయారు చేయడం వంటి కార్యక్రమాలను మానవుడు కంచుయుగం నుండి మొదలుపెట్టాడు. ఇవి శాస్త్రీయ పద్ధతులకు తొలిమెట్టుగా నిలిచాయి. తొలుత అవలంబించిన విధానాలలో కార్యకారణ సంబంధం..................