చావు బ్రతుకుల మధ్య
రవీంద్రనాథ్ టాగోర్
భర్త చనిపోయేక, బావగారైన రాణీహాట్ జమీందారు శంకరబాబు గారింట తలదాచుకున్న విధవ కాదంబరి. ఆమె పుట్టింటి తరపువారు ఒకరి తరువాత ఒకరు చనిపోయేరు. శంకరబాబు తప్ప భర్త వైపు దగ్గర బంధువులు లేరు; ఆమెకి పిల్లలూ కలగలేదు. బావగారు శంకర్ సంతానం - ఒక్కగానొక్క కొడుకు ఆమె కంటికి దీపం. ఆ అబ్బాయి పుట్టిన తరువాత, వాడికి చాలా జబ్బు చేసింది. వితంతువైన పిన్ని కాదంబరి, వాడిని చిన్నప్పటి నుంచి సాకింది. వాడు ఆమెకి ప్రాణంతో సమానం. వాడి మీద ఆమెకి ఏ విధమైన హక్కూ లేదు. సామాజికపరంగా ఆమెది కేవలం ప్రేమాభిమానాల హక్కు. కాని ఒక్క అభిమానం తోటే, తన హక్కుని సాక్ష్యాలతో సహా నిరూపించుకోలేదు, అలా చెయ్యాలన్న ఆలోచన కూడా ఆమెకి లేదు. ప్రాణాధికమైన ఆ పిల్లవాడిని రెండితలు ప్రేమించడం తప్ప ఆమె ఇంకేం చెయ్యలేదు.
ఆ విధవరాలు, తన హృదయంలో పేరుకుపోయిన ప్రేమనంతటినీ ఆ పిల్లవాడి మీద కుమ్మరించి, ఒక శ్రావణమాసపు రాత్రి ఆకస్మాత్తుగా మరణించింది. ఏ కారణం చేతనో, హఠాత్తుగా ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఈ ప్రపంచంలో అన్నిచోట్ల కాలచక్రం నడుస్తూనే వుంది. కాని కేవలం, ఆ స్నేహమయమైన, కోమలమైన చిన్న హృదయంలో మాత్రం గడియారం ఆగిపోయింది. ఆలస్యం చేస్తే పోలీసులు గొడవ మొదలు పెడతారేమోనని జమీందారు శంకర్, ఏ ఆడంబరం లేకుండా, అతి................................