ముగ్గురు మాంత్రికులు
తమ వద్దకు పరిగెత్తుకు వస్తున్న పిశాచా లను చూసి, పద్మపాదుడు చిరునవ్వు నవ్వాడు, భల్లూకకేతుడు మాత్రం వాటి కేసి చూసి, అయిష్టంగా తల పక్కకు తిప్పి, పింగళుడికి ఎంతో వినయంగా నమస్కరిస్తూ, "ప్రభో, ఈ క్షుద్రజీవా లకు నేను నాయకుడుగా వుండలేను. దయవుంచి నన్ను మీ వెంట తీసుకు పొండి!" అన్నాడు.
పింగళుడు జవాబేమీ చెప్పలేదు. అప్పుడు పద్మపాదుడు, భల్లూకకేతుడి భుజం తడుతూ, "భల్లూకకేతా! నువ్వు ఈ పర్వత ప్రాంతాల, ఈ రక్కసిగణానికి నాయకత్వం వహించి బతకటమే అన్ని విధాలా చిదని నా అభిప్రాయం!" అన్నాడు.
"అయ్యా, ప్రభో! ఆ జీవితం ఇక నాకు వద్దు!" అంటూ భల్లూకకేతుడు,
......................