ఈ గ్రంథ రచన జరిగి 150 సంవత్సరాలు కావస్తున్నది. అవి పెట్టుబడి దారీ వ్యవస్థ రూపుదిద్దుకుంటున్న రోజులు. అమానుషమైన తరతరాల భూస్వామ్యవ్యవస్థ బ్రద్దలు కొడుతున్న మొనగాడిగా పెట్టుబడిదారీ వర్గాన్ని ప్రజలు చూస్తున్న రోజులు. అయితే స్థిరపడేకొద్దీ దాని నిజస్వరూపం బట్టబయలు కాసాగింది. పెట్టుబడిదారీ వ్యవస్థ గొప్పతనం గురించి, దాని వికృతనైజం గురించి పోటాపోటీగా సాహిత్యం వెల్లువెత్తింది.