మహా యాత్రికులు
(356BC-323 BC) చేసిన దండయాత్రల వలన చాలా భౌగోళిక విషయాలు తెలిశాయి. 'చరిత్రలో అవే మొదటి హేతుబద్ధమైన ప్రయాణ వివరాలు' అని చరిత్రకారులు కూడా అంగీకరించారు.
అలెగ్జాండర్ తన యాత్రల్లో ఖగోళ, భూగోళ శాస్త్రాలు తెలిసిన పండితులను కూడా తోడు తీసుకొని వెళ్ళేవాడు. వారితోపాటుగా 'స్టెప్పర్స్' (Steppers) అనే ఉద్యోగులు ఉండేవారు. నడుస్తున్న సైనికుల కాలి అడుగుల్ని లెక్కించి, వారు ఎంత దూరం ప్రయాణించారో చెప్పటమే వీళ్ళ పని. నడిచినా, గుర్రం మీద ప్రయాణించినా వారి అడుగుల్ని, పరుగుల్ని లెక్కలు కట్టి; ఒక్క రోజులో ఎన్ని మైళ్ళు వారి సైన్యం ప్రయాణించిందో చెప్పగలిగేవారు. వారి
సుదూర ప్రయాణాలకి ఎంత సమయం అవసరమో, ఎంత ఆహార పదార్ధాల్ని వారి పక్కన తీసుకొనిపోవాలో, గమ్యం చేరేసరికి ఎన్నిరోజులు పడుతుందో తెలుసు కొనటానికి ఇలాంటి Steppers తమ సహకారం అందించేవారు.
క్రీ॥పూ॥ 4వ శతాబ్దంలో సముద్రయాత్రలు చేసి ప్రఖ్యాతిగాంచిన గ్రీకు యాత్రికుడు పిథియాస్ వలన నార్త్ వెస్ట్ ఐరోపా గురించి చాలా విషయాలు తెలిశాయి.
భారతీయులు ఆదికావ్యమైన రామాయణానికి 'రాముడు చేసిన ప్రయాణాలు' అని అర్థం. కాబట్టి మన మొదటి యాత్రా గ్రంథం రామాయణమే...........................