నారీహంతకుడు
అర్ధరాత్రి రెండు గంటల సమయం.
ఆనందరావుగారి యింట్లో ఫోను గణ మంది
నిద్రకళ్లు నలుపుకుంటూ వచ్చిన ఆనందరావుగారి భార్య శారదాంబ ఫోను రిసీవరు అందుకుని 'హలో' అంది మత్తుగా.
'ఎవరు మాట్లాడేది?' అవతలి నుంచి ప్రశ్న.
'ఆనందరావుగారి యిల్లు, ఎవరు కావాలి మీకు?' అంది.
'ఓ ! శారదాంబగారా! నమస్కారమండి! నేను, రాజశేఖరం మాట్లాడుతున్నాను. ఆనందరావుగారు లేరా!'
'లేరు! విందుకు వెళ్లారు. ఇంకా రాలేదు. ఏం యింత అర్ధరాత్రి పోలీసు ఇన్స్పెక్టరు గారికి వారితో అవసరం వచ్చింది'. మెల్లగా నవ్వుతూ అంది శారదాంబ.
అవతలి కంఠం నిశ్శబ్దంగా వూరుకుంది.
'ఏం శేఖరం! మాట్లాడవేం' అంది శారదాంబ.
'ఫోనులో చెప్పదగ్గ విషయం కాదు. శ్రమ అనుకోకుండా మీరు ఒక్క పదినిముషాలు మేలుకున్నట్టయితే నేను స్వయంగా వచ్చి మనవి చేసుకుంటాను' అన్నాడు రాజశేఖరం.
అతని కంఠంలో మార్పు గమనించి శారదాంబ ఒక్కక్షణం నిదానించి దానికేం అలాగే రా!' అంటూ ఫోన్ కట్ చేసి త్వరగా లోనికి పోయి నైట్ గౌను మార్చి జా చీరె కట్టుకుని వంట మనిషిని లేపి కాఫీ చెయ్యమని పురమాయించి డ్రాయింగ్ రూంలో సోఫాలో రాజశేఖరంకోసం ఎదురుచూస్తూ కూర్చుంది.
పది నిముషాలు దాటకుండానే రాజశేఖరం ప్రత్యక్షమయినాడు. 'శ్రమకి క్షమించాలి. చాలా అవసరమైన విషయం గనుక మిమ్మల్ని డిష్టర్బు చేశాను' అన్నాడు. సోఫాలో చతికిల పడుతూ................................