రత్నం గారితో నా అనుబంధం
H.No.15-1-1224, 4th Cross,
Netajinagar, Nelloore-524004.
-మెట్టు రామచంద్రప్రసాద్,
'శివగామి' కార్యకర్త
నా చిన్ననాటి మిత్రుడు సహాధ్యాయి డాక్టర్ గుంజి వెంకటరత్నం లెక్కకు మించి ఎన్నో రచనలు చేశారు, చేస్తూ ఉన్నారు. 1958 నుండి మా మైత్రీ బంధం కొనసాగుతూనే ఉంది. 1958-61 నడుమ మేము నెల్లూరు వెంకటగిరి రాజా కళాశాలలో త్రీ వైడీసీ (త్రీ ఇయర్ డిగ్రీ కోర్స్) చదివిన రోజులు. మా గ్రూపు ప్రత్యేకం. అన్నీ భాషలే. తెలుగు మెయిన్ 600 మార్కులు. హిందీ సబ్సిడరీ 200 మార్కులు. సంస్కృతం సబ్సిడరీ 200 మార్కులు. మొత్తం గ్రూప్ 1000 మార్కులు. జనరల్ సబ్జెక్ట్స్ అందరికీ లాగే మాకు ఇంగ్లీషు, తెలుగు ఉండేవి. ఈ గ్రూప్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో తప్ప ఇంక ఎక్కడా లేదు. మా బ్యాచ్ తర్వాత కూడా ఈ గ్రూప్ ఎక్కడా లేదు.
మా గ్రూపులో మొత్తం 14 మంది విద్యార్థులం. అందులో శ్రీమతి వనజకుమారి గారు ఒక్క మహిళా విద్యార్థి. మా క్లాస్ లీడర్ వెంకటరత్నం వయసులో మా అందరి కన్నా పెద్ద. అలాగే అందరికన్నా నేనే చిన్న. మాలో జీవి రత్నం, పాపయ్య, దశరథరామిరెడ్డి, సాంబిరెడ్డి గారలు వీఆర్ కాలేజీ హాస్టల్ నుండి వచ్చేవాళ్లు.
మాలో మరో ఐదు మందిమి మాత్రం బియ్యే తర్వాత 1961-62లో ఎంఏ తెలుగు చదివేందుకు తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ కళాశాలకు పోయాము. నేను, డాక్టర్ మల్లెల గురువయ్య గారు, శ్రీ మోపూరు వేణుగోపాలయ్య గారు, శ్రీ గంథి వెంకటస్వామి గారు, శ్రీ సీతారామయ్య గారు మొత్తం ఐదుగురం. ఈ ఐదుగురూ ఇంకా జీవీ రత్నంగారు, డాక్టర్ సానికొమ్ము అక్కిరెడ్డి గారు మొత్తం 7 మందిమి తర్వాతి కాలంలో లెక్చరర్స్ తెలుగు హెడ్స్ అయ్యాము.
నేనూ శ్రీ మోపూరు వేణుగోపాలయ్య గారు నెల్లూరు వెంకటగిరి రాజా కళాశాలలో, | డాక్టర్ మల్లెల గురవయ్య గారు మదనపల్లి అనిబిసెంట్ కళాశాలలో, శ్రీ గంథి......................