నేనిలా విన్నాను - ఒక సమయంలో భగవానుడు పెద్దభిక్షుసంఘంతో చంపాలో గగ్గరాపుష్కరిణీ తిరంలో ఉంటున్నాడు. అప్పుడు మావటి పుత్రుడు పేస్సుడు, కందరకపరివ్రాజకుడు భగవానుడు ఉన్నచోటుకి చేరుకొన్నారు; చేరుకొన్న తర్వాత మావటి పుత్రుడు పేస్సుడు భగవానునికి నమస్కరించి ఒకపక్కన కూర్చున్నాడు. కందరకపరివ్రాజకుడు భగవానుని కుశలమడిగాడు. కుశలాదికాలు పూర్తిచేసుకొని ఒకపక్కన నిలబడ్డాడు. ఒకపక్కన నిలబడిన ఆ కందరకపరివ్రాజకుడు మౌనంగా | మౌనంగా ఉన్న భిక్షుసంఘాన్ని చూసి, భగవానునితో ఇట్లన్నాడు - "శ్రీమాన్ గౌతమా, ఆశ్చర్యం, శ్రీమాన్ గౌతమా అద్భుతం. శ్రీమాన్ గౌతమునితో ఈ భిక్షుసంఘం సరియైన మార్గంలో పెట్టబడింది! అతీతంలోని అంతులు, సమ్మాసంబుదులైన భగవానులు కూడా, శ్రీమాన్ గౌతమునివలెనే | భిక్షుసంఘాన్ని సరియైనమార్గంలో పెట్టి ఉంటారు. భవిష్యత్తులో ఉండబోయే అర్హతులు, సమాసంబుదులైన భగవానులు కూడా శ్రీమాన్ గౌతమునివలెనే భిక్షుసంఘాన్ని సరియైన మార్గంలో పెడతారు."
"కందరకా, అది అంతే, కందరకా అది అలాగే. నేను భిక్షుసంఘాన్ని సరియైనమార్గంలో పెట్టినట్లుగానే, అతీతంలోని అర్హతులు, సమ్మాసంబుద్ధులైన భగవానులు కూడా, భిక్షుసంఘాన్ని సరియైన మార్గంలో పెట్టారు. నేను భిక్షుసంఘాన్ని సరియైన మార్గంలో పెట్టినట్లుగానే, భవిష్యత్తులో ఉండబోయే అరతులు, సమ్మాసంబుదులైన భగవానులు కూడా నా వలెనే భిక్షు సంఘాన్ని సరియైన మార్గంలో పెడతారు..............