థేరీగాథలు
రెండువేల ఐదువందల అరవై అయిదు సంవత్సరాల కింద బుద్దుడు 'మహాపరినిర్వాణం పొందిన తర్వాత భిక్షువులు మహాకాశ్యపథేరుని అధ్యక్షతన మగధదేశపు రాజధాని రాజగృహనగర సమీపంలో సప్తపర్ణికా గుహలో సమావేశమై సుత్త, వినయాలను సంగ్రహించారు. సుత్త పిటకలో బుద్దుని బోధనలు ఉన్నాయి. వినయలో భిక్షుసంఘ నిర్మాణం, భిక్షువులు, భిక్షుణులు పాటించవలసిన నియమాలు ఉన్నాయి. సుత్త పిటకలో దీఘనికాయ, మజ్జినికాయ, సంయుత్తనికాయ, అంగుత్తర నికాయ, ఖుద్దనికాయ అనే అయిదు భాగాలు ఉన్నాయి. అయిదవ భాగమైన ఖుద్ధకనికాయలోని గ్రంథాలలో థేరీగాథలు ఒకటి.
కష్టాలు, కన్నీళ్ళతో అలసి కొందరు, భోగవిలాసాలను రోసి కొందరు, మొత్తమ్మీద ఎందరో స్త్రీలు సంఘంలో ప్రప్రజించి బుధభగవానుని సన్నిధిలో | సేదదీరారు. స్వశక్తితో ప్రయత్నించి నిర్వాణపదాన్ని అందుకొన్నాru...............