"తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలంది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణాన్నంతా రచనల్లో కూర్చిన వ్యక్తి. "
1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు మిక్కిలిగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, వేలకొలది ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కనుమూశారు.
“కాలు విరిగిన ఒక గోరువంక 17 జూలై 1958 లో చలం గారింటికి వచ్చింది. ఆరోజు నుండి అక్టోబరు 6 వరకు దాని దినచర్యను గమనించి తారీఖులవారీగా డైరీలాగా వ్రాశారు. డైరీలో 'నాన్న' అంటే చలమే.
ఇటువంటి రచన తెలుగులో ఇది ఒకటే నిజమయిన గోరువంక, నిజమయిన డైరీ. ఈ గోరువంక సంగతి మిత్రులకు వ్రాస్తే ఇంగ్లీషులో ఒక రచన ఉన్నదని - మీరు దీన్ని డైరీగా వ్రాయమని ప్రోత్సాహించారు వారు.”................................................