సౌవర్ణిక
ప్రభాససామ్రాజ్యం రాజధాని ధారానగరంలో పండుగ వాతావరణం.
ప్రతి ఇల్లు కళకళలాడిపోతోంది. ప్రతీ వ్యక్తి మనసు సంతోషంతో ఉప్పొంగిపోతోంది. కారణం రాజాధిరాజు ఆనందవర్ధన మహారాజు సుమారు పదునెనిమిది మాసాల తర్వాత రాజధానికి తిరిగి వస్తున్నారు.
రాజ్యమంతా పర్యటించి, సామంతరాజ్యాలలో తలయెత్తిన సమస్యలు సామ, దాన, దండోపాయాలతో పరిష్కరించి, సరిహద్దు ప్రాంతాలను పటిష్ఠం చేసి, జైత్రయాత్ర ముగించుకుని, విజయో త్సాహంతో తిరిగి వస్తున్నారు.
ప్రజలకు ప్రత్యక్షదైవం వంటి నాయకుడు. ఆయన దర్శనం లభిస్తే చాలు పరవశించిపోతారు ప్రజలు. ఆయన ఉనికే వారికి శ్రీరామరక్ష.
ఇక రాజభవనంలో సందడి వర్ణనాతీతం.
రాజమాత భవానీదేవి కుమారుని రాక గురించి తెలుసుకొని....................