మనిషిలోని మృగానికి అద్దం పట్టే 'గులాబి'
ప్రఖ్యాత రచయిత స్టీఫెన్ కింగ్ ఒక మాట అంటారు, “భయపెట్టే రాక్షసులు మన మంచం కింద ఉండరు, వాళ్ళు మనలోనే ఉంటారు.” ఈ 'గులాబి' నవల చదవడం మొదలుపెట్టిన కొన్ని పేజీలకే ఆ మాట ఎంత నిజమో మీకు అర్థమవుతుంది. ఇది కేవలం ఒక నేరానికి సంబంధించిన కథ కాదు. ఇది మానవ సంబంధాల ముసుగులో దాగి ఉన్న స్వార్థానికి, మోసానికి ప్రతీక.
ఈ నవలలో రచయిత భువన్ సృష్టించిన ప్రపంచం చాలా సాదాసీదాగా, మన కళ్ళ ముందు జరిగే వ్యవహారంలానే కనిపిస్తుంది. కానీ దాని లోతుల్లోకి వెళ్లే కొద్దీ, ఈ తరం మనుషుల ఆలోచనా విధానం చూసి వెన్నులో వణుకు పుడుతుంది. ఆడ, మగ, వయసు అనే తేడా లేకుండా... తమకు కావాల్సింది దక్కించుకోవడానికి మనుషులు ఎంతకైనా తెగిస్తారు అనడానికి ఈ కథే నిదర్శనం. ప్రేమ పేరుతో వల వేసే అమాయకత్వం ఒక వైపు, బతుకు తెరువు కోసం దొంగతనాలు చేసే నిస్సహాయత మరోవైపు. ఈ రెండింటి మధ్య నలిగిపోయే జీవితాలే ఈ నవల.
నేటి యువత నేరాల వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారు? అన్న ప్రశ్నకు ఈ పుస్తకం సూటిగా సమాధానం చెబుతుంది. కేవలం సినిమాలూ, నవలలూ చూసి యువత చెడిపోతున్నారనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి, సమాజంలో జరుగుతున్న దారుణాలే సినిమాలకు, కథలకు ముడిసరుకు అవుతున్నాయి. తెలుగు సాహిత్యంలో ఇలాంటి కథ ఇంతకు ముందెప్పుడూ రాలేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. నెల్లూరు లాంటి పట్టణాల్లో, ప్రేమ, డబ్బు చుట్టూ తిరిగే యువత ఆవేశం, అత్యాశ ఎలా ఉంటుందో రచయిత కళ్లకు కట్టినట్లు చూపించారు,.
ఇందులో కుమార్, జ్యోత్స్న, పాండు లాంటి పాత్రలు మనకు పరిచయమున్న..........................