మేరీ జననం
ఇస్రాయేలు దేశంలో ఐయోసం అనే భాగ్యవంతుడు ఒకతను వున్నాడు. అక్కడ దేవాలయంలో ఈశ్వర మహోత్సవం సమీపించింది. ఇస్రాయేలు దేశస్తులందరూ వారివారి కానుకలను దేవాలయంలో సమర్పించుకున్నారు. ఐయోసిం తన కానుకలను రెండు భాగాలుగా చేసి, “నాకున్న ధన సమృద్ధిలో కొంత బీదవారికి దానంగా, రెండోవొంతు నా పాప పరిహారంగా ఈశ్వరుడికి సమర్పిస్తాను.” అని సమర్పించుకున్నాడు.
కాని దేవాలయ పూజారి అయిన రూబెన్ "నీవు సంతానం లేనివాడివి గనక నీకానుకని ఈశ్వరుడికి అర్పించడం అపచారం" అని ఐయోసిం కానుకని నిరాకరించాడు.
జరిగిన దానికి విచారిస్తో, ఐయోసిం ఇస్రాయేలు చరిత్రని సమగ్రంగా పరిశీలించాడు. తనకేగాక ఇటువంటి దుస్థితి ఇంకెవరికయినా తటస్థించిందే మోనని, అందులో, ధర్మపరులందరూ సంతానవంతులేనని తెలుసుకున్నాడు. కాని అతనికి. తమ పూర్వీకుడయిన అబ్రహాంకి వృద్ధాప్యంలో ఈశ్వరుడు ఐసాక్ అనే పుత్రుణ్ని ఎట్లా ప్రసాదించారో జ్ఞాపకం వొచ్చింది.
దానితో ఐయోసింకి మరింత దుఖమెక్కువయి, ఇంటికి వెళ్ళక, ఎడారిలో ఒక డేరా వేసుకుని నలభై రోజులు ఉపవాసంలో గడిపాడు. “నాప్రభువయిన ఈశ్వరుడు నాకు దర్శనమిచ్చి నన్ను కటాక్షించిందాకా, నా ప్రార్థనే నా ఆహారం, నా జలం" అని దీక్షతో ఈశ్వరుణ్ని ధ్యానించాడు.......................................