Logili Books

Devotional and Religion

Nisheethi

By Sri Dharan Kanduri

₹270
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nisheethi
Publisher
Sri Dharan Kanduri
ISBN
MANIMN5148
Published Date
2023
Number Of Pages
286
Language
Telugu
Availability
In Stock
About this book

పిశాచ బాధలను నిర్మూలించే 'మెహందీపూర్ బాలాజీ' మందిర మర్మం?

 

రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో ఉన్న మెహందీపూర్ అనే ఒక చిన్న స్థాయి పట్టణంలో మహాద్భుతమైన ఒక హనుమాన్ ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో హనుమంతుడి యొక్క బాలరూపం పూజలందుకుంటున్నది. ఆ కారణంగానే ఈ ఆలయంలోని హనుమాన్ని "బాలాజీ" అని పిలుస్తారు. (నోట్ : దక్షిణ భారతదేశంలోని తిరుమల కొండపై వెలసిన శ్రీనివాసుడిని కూడా "బాలాజీ” అని పిలుస్తారు. కనుక, తిరుమలలోని బాలాజీ మరియు మెహందీపూర్ లోని బాలాజీ ఒకరు కాదని గుర్తించాలి.)

కరాలి మరియు దౌసా జిల్లాల సరిహద్దులో ఈ మెహందీపూర్ గ్రామం ఉన్నది. ఒక విశేషం ఏమంటే, ఈ ఆలయంలో సగభాగం - ఒక జిల్లా సరిహద్దులో ఉండగా, సగ భాగం - ఇంకొక జిల్లా సరిహద్దులో ఉన్నది. రెండు పర్వతాల మధ్య పొందికగా ఇమిడి ఉన్న మెహందీపూర్ గ్రామంలోని ఒక పర్వతంపైన కొన్ని శతాబ్దాల క్రితం బాలహనుమంతుడు (బాలాజీ) స్వయంభుగా అవతరించాడు. గతంలో దట్టమైన అరణ్యంగా ఉన్న ఈ ప్రాంతంలోని ఈ పర్వతంపైన క్రీ.శ. 9వ శతాబ్దంలో గణేష్పురి అనే ఒక పూజారి, మొదటిసారిగా బాలాజీ ఆలయాన్ని నిర్మించాడు. కాలక్రమంలో ఈ ప్రాంతం అంతా ఒక గ్రామంగా మారిపోయింది. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం - రాజపుత్ర వాస్తు శిల్పకళా శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయ పరిసరాలు అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతోనూ మరియు ఏదో తెలియని భయాన్ని కలిగించే వాతావరణంతోను నిండి ఉంటాయి.

ఈ బాలాజీ ఆలయంలో ప్రధాన దైవం అయిన బాలాజీ విగ్రహం ఒక రాయిలో ఏర్పడింది. 'స్వయంభు'గా అవతరించిన ఈ బాలాజీ విగ్రహం లేదా రూపం యొక్క ఎడమ ఛాతీ మీద ఉన్న ఒక రంధ్రం నుండి నిరంతరమూ జలం స్రవిస్తూ ఉంటుంది. విగ్రహానికి సాంప్రదాయయుక్తంగా వస్త్రములు ధరింపచేసిన తరువాత కూడా ఈ జలధార ఆగదు. నిర్విరామంగా స్రవించే ఈ జలం ఈ విగ్రహ పాదాల వద్ద ఒక చిన్న సరస్సులాగా ఏర్పడింది..................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?