ఈషాన్ రెప్పవాల్చకుండా క్లాసులో తోటి విద్యార్థులను గమనిస్తున్నాడు. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నాయి. సోషల్ టీచరుకు జ్వరం రావడంతో ఆ రోజు సెలవు పెట్టింది. సాధారణంగా ఇలాంటప్పుడు ఖాళీగా ఉండే మరో టీచరును క్లాసు తీసుకోమనేవారు. కానీ మరో ఇద్దరు టీచర్లు కూడా సెలవులో ఉండటంతో కుదరలేదు.
క్లాసు టీచరు వనజ మేడమ్ వచ్చి విద్యార్థులకు విషయం చెప్పి అందరినీ సోషల్ స్టడీస్ పుస్తకాలు తీసుకొని చదువుకోవాలని చెప్పి వెళ్లింది. క్లాస్మేట్స్ అల్లరి చేయకుండా చదువుకునేలా చూసే బాధ్యత ఈషాన్పై పడింది. ఈషాన్ తొమ్మిదో క్లాసు 'ఎ' సెక్షన్కు క్లాస్ పీపుల్ లీడర్. చురుగ్గా ఉంటాడు. క్లాసులో ఫస్టొస్తాడు. దీంతో సీపీఎల్ను చేశారు.
ఈషాన్ మామూలుగా అందరితో కలివిడిగా, స్నేహంగా వారిలో ఒకడిగా ఉంటాడు. అయితే ఇప్పుడు క్లాస్మేట్స్ అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకునేలా చూడాల్సిన బాధ్యత తనపై పడింది. క్లాసులో బ్లాక్ బోర్డు దగ్గర నిలబడి ప్రతి ఒక్కరినీ డేగకళ్లతో గమనిస్తున్నాడు.
అందరూ వంచిన తల ఎత్తకుండా సోషల్ స్టడీస్ పుస్తకాల్లో లీనమయ్యారు. ఒక్క అర్జున్ మాత్రం నిద్రపోతున్నాడు. ఈషాన్ అతడి దగ్గరకు వెళ్లి భుజం తట్టాడు. దాంతో అర్జున్ తలెత్తి పుస్తకం తీసుకున్నాడు. మరో పది నిమిషాలు గడిచాయో లేదో అర్జున్ బల్లపై తలవాల్చి నిద్రలోకి జారుకున్నాడు. ఈసారి ఈషాన్ మాత్రం అర్జున్ని నిద్రనుంచి లేపలేదు.
ఆ తర్వాత అర్జున్ గురించి క్లాస్ టీచరుకు ఫిర్యాదు చేశాడు. అది తన బాధ్యత. అలా చేయకుంటే దాన్ని సరిగా చేసినట్లవదు అనుకున్నాడు మనసులో.
అర్జున్ను టీచర్ పిలిచి, 'యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నాయి. ఇలా అశ్రద్ధగా ఉంటే ఎలా? పైగా నెక్స్ట్ ఇయర్ టెన్లోకి వస్తున్నారు' అంటూ కోప్పడింది...................