• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Mana Rajyagam Mana Atmagowravam

Mana Rajyagam Mana Atmagowravam By Dr Pardhasaradhi Chiruvolu

₹ 150

పోరాటపథం

పా పార్లమెంటు సెంట్రల్ హాలులో నిర్వహించిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షోపన్యాసం చేశారు. "ఒక రకంగా **భారత రాజ్యాంగం మేధావుల మూడు సంవత్సరాలు అమోఘ కృషికి దర్పణంగా కనిపించినా నిజానికి అది దీర్ఘకాలం సాగిన స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించి ప్రతిఫలనం. ప్రపంచంలోకెల్లా సాటిలేని స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించిన పలు ఆదర్శభావనలను ఇందులో ప్రతిష్ఠించారు. రాజ్యాంగంలోని పీఠికలో ఈ 6. దృష్టాంతాలు క్లుప్తంగా దర్శనమిస్తాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు కూడా వాటిలో ఉన్నాయి. తరతరాలుగా ఇవి భారత దేశానికి జీవనాడిగా ఉన్నాయి” అని ఆమె వివరించారు.

రాజ్యాంగానికి సంబంధించిన ఏ చర్చనైనా, మొట్టమొదటి సారిగా రాజ్యాంగ సభ ఏర్పడిన 1946 డిసెంబరు నుంచి ప్రారంభిస్తుంటాం. కాని, భారత దేశానికి సొంతంగా రాజ్యాంగాన్ని రూపొందించుకునేందుకు అనుమతి ఇవ్వాలనే ఉద్యమం అంతకు పాతికేళ్ల క్రితమే ప్రారంభమైంది. 1857 నాటి మొదటి స్వాతంత్ర్య పోరాటం బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పునాదులను కదిలించివేసింది. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం భారత్ పైన పట్టు బిగించింది. లార్డ్ పామర్దన్ నేతృత్వంలోని బ్రిటిష్ ప్రభుత్వం భారత్ ను కంపెనీ నియంత్రణలో నుంచి తప్పించి మహారాణి రాజ్యాంగ పాలన పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. దాంతో మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వ చట్టం 1858లో అమలులోకి వచ్చింది. ఇండియాపైన నేరుగా బ్రిటిష్ రాజరికం పెత్తనం మొదలయ్యింది. పాలనలో భారతీయులు ఎవరికీ అవకాశం కల్పించలేదు. అప్పటికే ఇండియన్ సివిల్ సర్వీసెస్ ప్రారంభమైంది, బ్రిటిష్ మహారాణి సేవకులుగా వారు విధులు నిర్వర్తించేలా నిబంధనలు రూపొందించారు.....................

  • Title :Mana Rajyagam Mana Atmagowravam
  • Author :Dr Pardhasaradhi Chiruvolu
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN6668
  • Binding :paparback
  • Published Date :Sep, 2025
  • Number Of Pages :160
  • Language :Telugu
  • Availability :instock