పందొమ్మిదో శతాబ్ది మధ్యకాలం నుండీ, ప్రపంచమంతా వికసిస్తూ వస్తున్న ఆధునిక కథ, సాహిత్య ప్రక్రియల్లో, మరీ ఇటీవలిది. కాని, కవిత్వం కన్నా, నవలకన్నా, నాటకంకన్నా కూడా ఎక్కువ జనాదరణ పొందింది. అటువంటి ఆధునిక కథల్లో, ప్రపంచసాహిత్యాల అనువాదాల నుంచి, నలభయ్యేళ్ళ కింద, తాను చదివిన కథల్లో తననిప్పటికీ వెన్నాడుతున్న ఇరవై కథల్ని వాడ్రేవు చినవీరభద్రుడు ఈ పుస్తకం ద్వారా పరిచయం చేస్తున్నారు. ఇందులో నాలుగు కథలు ఈ పుస్తకం కోసం ఆయన ప్రత్యేకంగా అనువదించారు. కథల్ని ఇష్టపడే పాఠకులకి ఇందులో ప్రతి ఒక్క కథా మరపురాని కథగా మిగిలిపోతుందనీ, సిద్ధహస్తులైన కథకులకీ, కొత్తగా కథలు రాసేవాళ్ళకీ కూడా ఇందులో ప్రతి ఒక్క కథా ఒక పాఠంగా ఉపకరిస్తుందని మా నమ్మకం.......................