నాకూరు
నాకూరు రైల్వే డివిజన్ కార్యాలయంలో నేను చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల గుండా సాగిపోయే రైల్వేకు దక్షిణ విభాగమని పేరు పెట్టడం జరిగింది. ఈ మధ్యన పశ్చిమ డివిజన్ నుంచి బదిలీ మీద వచ్చిన నాకు నా రాష్ట్రానికి, నా ప్రాంతానికి మళ్లీ వచ్చిన సంతోషం ఒకవైపున ఉంటే, నా ప్రజలతో కలిసి మెలిసి ఉండే అవకాశం దొరికినందుకు తృప్తి, ప్రశాంతతలు కూడా దొరికాయి.
మూడు రాష్ట్రాల ముఖ్య కార్యాలయాలను ఒక్కొక్కసారి సందర్శించి పరిశీలించడంలోనే ఆరు నెలలు గడిచిపోయాయి. ఫీల్డ్ విజిట్ అంటే అంత సులభమా? పైగా పాలనలో రాజకీయ ఒత్తిడి. అక్కడక్కడ ప్రమాదాలు. మొత్తానికి తలనొప్పి...
స్టెనో - ఇంటర్ కామ్ ద్వారా, "సార్ ఈ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మిమ్మల్ని కలవడానికి అపాయింట్మెంట్ అడుగుతున్నారు. లోపలికి పంపమంటారా?” అని అడిగింది.
“ఎస్, పంపండి" అన్నాను.
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రావడానికి కారణం కొత్తగా నిర్మిస్తున్న 'మంగళూరు- హాసన' ట్రాక్లో ఉండే నాకూరు వంతెన ప్రారంభోత్సవం చేసే రోజును నిర్ణయించడం కోసం.
ఆ వంతెన నిర్మాణం రైల్వేకు, ఇంజనీర్లకు ఒక సవాలుగా ఉండేదని విన్నాను. ఆ వంతెనే ఏమిటి? 'మంగళూరు- సకలేశపుర' ట్రాక్ నిర్మాణ కార్యకలాపాల పొడవునా కఠినమైనది.
“సార్, మొత్తం ట్రాక్ ఓకే. నాకూరు వంతెనలో ఏవో కొన్ని పనులు మిగిలివున్నాయి. అవి కూడా ఈ వారం పూర్తవుతాయి. మీరు ప్రారంభోత్సవం చేయాలి. ఏ రోజు ప్రారంభోత్సవం చేయాలో ఆ రోజును నిర్ణయించాలి" అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫైలు తెరిచి నా ముందు పెడుతూ అన్నారు.
“ఈ వారం చెన్నై టూర్ ఉంది. అత్యవసరమైన పని. వచ్చే శుక్రవారం పెట్టుకోవచ్చు.................................